Political News

చంద్ర‌బాబుకు స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నోటీసులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పోలీసు శాఖ‌లో తృతీయ శ్రేణి ఉద్యోగిగా వ్య‌వ‌హ‌రించే స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్(సీఐ) శంక‌ర‌య్య నోటీసులు పంపించిన వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన శంక‌ర‌య్య ఈ నెల 18న సీఎం చంద్ర‌బాబుకు నోటీసులు పంపించారు. దీనిలో ఆయ‌న మూడు కీల‌క డిమాండ్లు చేయ‌డం గ‌మ‌నార్హం. 1) త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పడం. 2) త‌న‌ను మాన‌సిక‌క్షోభ‌కు గురిచేసి.. డిపార్ట్‌మెంటులో త‌న‌కు అవ‌మానాలు ఎదుర‌య్యేలా చేసిన నేప‌థ్యంలో దీనికి ప‌రిహారంగా రూ.కోటి ఇవ్వ‌డం. 3) అసెంబ్లీ వేదిక‌గానే త‌న‌పై క్ష‌మాఫ‌ణ‌లు చెప్ప‌డం. అయితే.. సీఐ ఇచ్చిన ఈ నోటీసుల వ్య‌వ‌హారం.. తాజాగా వెలుగు చూసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి వివేకానంద‌రెడ్డి 2019లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే.. అప్ప‌ట్లో పులివెందుల సీఐగా వ్య‌వ‌హ‌రించిన శంక‌ర‌య్య‌.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డితో మిలాఖ‌త్ అయ్యార‌ని.. గొడ్డ‌లి పోటును గుండెపోటుగా చిత్రీక‌రించిన వారికి స‌హ‌క‌రించార‌ని.. అదేవిధంగా ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను తుడిచేస్తున్న క్ర‌మంలో వాటిని వీడియోలు తీయ‌కుండా మీడియాను బెదిరించార‌ని.. అదేవిధంగా మీడియాకు చెందిన కొంద‌రిపై కేసులు పెట్టార‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిపై గ‌తంలోనే సీబీఐ ప‌లు మార్లు శంక‌ర‌య్య‌ను అదుపులోకి తీసుకుని విచారించింది. త‌ర్వాత‌.. వ‌దిలేసింది.

ఇదిలావుంటే.. గతంలోను, ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌హా పార్టీ నాయ‌కులు సీఐపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ నాటి కేసులో సీఐని మ‌రింత లోతుగా విచారిస్తే.. నిజానిజాలు తెలుస్తాయ‌ని అన్నారు. వైసీపీ నాయ‌కుల‌తో మిలాఖ‌త్ అయ్యార‌ని వ్యాఖ్యానించారు. కాగా.. అప్ప‌టి నుంచి శంక‌ర‌య్య స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా శంక‌ర‌య్య సీఎం చంద్ర‌బాబుకు నోటీసులు పంపించారు. త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని..అదికూడా అసెంబ్లీలోనే చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 18నే త‌న లాయ‌ర్ ధ‌ర‌ణేశ్వ‌ర రెడ్డితో నోటీసులు పంపించిన‌ప్ప‌టికీ.. ఆల‌స్యంగా ఈవిష‌యం వెలుగు చూసింది. ఇక‌, ప్ర‌భుత్వం దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

వైసీపీ ప‌న్నాగ‌మే!

మ‌రోవైపు.. సీఐ శంక‌ర‌య్య నోటీసుల‌పై టీడీపీ నాయ‌కుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నోటీసుల వెనుక వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని అంటున్నారు. వారి ప్రోద్బ‌లంతోనే ఈ నోటీసులు పంపించి ఉంటార‌ని తెలుస్తోంద‌ని చెబుతున్నా రు. సీఐ శంక‌ర‌య్య పాత్ర లేక‌పోతే.. సీబీఐ ఆయ‌న‌ను ఎందుకు విచారించింద‌ని కూడా ప‌లువురు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా.. మ‌రోవైపు హోం శాఖ ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. శంక‌ర‌య్య‌పై డిపార్ట్‌మెంటు ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల సంఘం డీజీపీకి విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

16 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

48 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago