Political News

వైసీపీలో నేతలు కట్టు దాటుతున్నారా ?

పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రోడ్డున పడుతున్న విభేదాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రజా ప్రతినిధులందరూ క్రమశిక్షణతోనే ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారిలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గతంగా ఉన్న గొడవలు ఇప్పుడిప్పుడే బయటపుడుతున్నాయి. ఆమధ్య వైజాగ్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవను మరచిపోకముందే తాజాగా కాకినాడలో పెద్ద గొడవైంది. మధ్యలో కూడా కడప, కర్నూలులో కూడా గొడవలయ్యాయి.

నిజానికి పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికే అన్న విషయం అందరికీ తెలిసిందే. విజయసాయితో మాట్లాడుతున్నపుడు జగన్ తో మాట్లాడుతున్నట్లుగానే నేతలు భయ, భక్తులతో ఉంటారు. అలాంటిది డీఆర్సీ సమావేశంలో ఏకంగా ఎంపితోనే అదీ బహిరంగంగా ఎంఎల్ఏలు వాదనకు దిగారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములను రాజకీయ నేతలు కబ్జాలు చేస్తున్నారనే పాయింట్ మీద ఇటు విజయసాయికి అటు ఎంఎల్ఏలు కరణం ధర్మశ్రీ, అమరనాధ్ కు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.

కడపలో పార్టీ నేతల మధ్య జరిగిన గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే జగన్ సొంత జిల్లా అయ్యుండి ఆధిపత్యం కోసం నేతలు బహిరంగంగానే గొడవలు దిగటమే ఆశ్చర్యమేసింది. కర్నూలులోని నందికొట్కూరు ఎంఎల్ఏ ఆర్ధర్ కు నియోజకవర్గంలో కీలక నేతకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎవరిది పై చేయనే విషయంలో ఇన్చార్జి మంత్రి ముందే ఇద్దరు పెద్దగా వాదులుకోవటం అందరు చూసిందే.

తాజాగా కాకినాడలో రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఇక్కడ టిడ్కో ఇళ్ళల్లో అవినీతి జరిగిందన్న ఎంపి ఆరోపణలపై ప్రతిపక్ష ఎంఎల్ఏలు కాకుండా అధికారపార్టీ ఎంఎల్ఏ స్పందించటమే విచిత్రంగా ఉంది. అవినీతి ఆరోపణలు చేసేముందు తమతో చర్చించాలని, అవినీతికి పాల్పడిందో ఎవరో చెప్పాలంటూ ద్వారపూడి ఎంపితో పెద్ద వాదనకు దిగారు. దాంతో మిగిలిన వాళ్ళు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సొచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జిల్లాలోని మంత్రులు-ఎంపిలు-ఎంఎల్ఏల మధ్య సమన్వయం లేని విషయం బయపడిపోతోంది. దీనికితోడు పెరిగిపోతున్న ఆధిపత్య సమస్య వల్ల బహిరంగంగానే గొడవలు పడుతున్నారు. ఎక్కడైనా అధికార-ప్రతిపక్ష నేతల మధ్య గొడవలు జరగటం సహజం. కానీ ఇక్కడ అధికారపార్టీ నేతల మధ్యే గొడవలు జరుగుతున్నాయి. అంటే ప్రజా ప్రతినిధులు కావచ్చు నేతలూ కావచ్చు మొత్తానికి కట్టు తప్పిపోతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ గొడవలన్నీ జగన్ దృష్టికి వెళుతున్నాయో లేదో తెలీదు. వైజాగ్ లో జరిగిన గొడవ తర్వాత ఎంఎల్ఏలను పిలిపించుకుని జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. మరి కాకినాడలో జరిగిన గొడవపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Satya

Recent Posts

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

18 minutes ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

45 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

1 hour ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago