Political News

ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు దాడి చేశారు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఆ పార్టీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన క‌విత విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. “ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు క‌లిసి దాడి చేశారు” అని అన్నారు. అయినా.. క‌విత వ్య‌వ‌హారం రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యం కాద‌న్న ఆయ‌న‌, కేవ‌లం కుటుంబం, ఆస్తికి సంబంధించిన విష‌య‌మేన‌ని తేల్చి చెప్పారు. కుటుంబ వ్య‌వ‌హారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ఇత‌ర పార్టీల‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ స‌మాజం ఎప్పుడో బ‌హిష్క‌రించింద‌ని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అనే మాట ‘గ‌తం’ అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ఎప్పుడో ఆయ‌న‌ను మ‌రిచిపోయార‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు అంశాల‌ను ప్ర‌స్తా వించారు. ప్ర‌ధానంగా ఎమ్మెల్యేల జంపింగుల విష‌యంపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “బీఆర్ఎస్‌కు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అంటే.. ఆ విష‌యంలో ఆ పార్టీనే కాకిలెక్క‌లు చెబుతోంది. కేటీఆర్ ఒక‌టి చెబుతాడు.. హ‌రీష్ రావు ఇంకోటి చెబుతాడు. ఏది నిజం. 37 మంది ఉన్నార‌ని కేటీఆర్ అంట‌డు. కానీ, ఇంకోటి ఎక్కువ చేసి హ‌రీష్‌రావు చెబుత‌డు. ఆ పార్టీకే క్లారిటీలేదు.” అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు.. త‌న ఇంటికి వ‌చ్చిన వారికి తాను కండువా క‌ప్పాన‌ని.. అంత మాత్రాన వారు పార్టీలో చేరిపోయిన‌ట్టేనా? అని వ్యాఖ్యానించారు. ఇదో ప‌ని, పాట లేని కార్య‌క్ర‌మం అని అన్నారు.

ఇక‌, కాళేశ్వ‌రం విష‌యంపై బీజేపీని త‌ప్పుబ‌ట్టారు. కాళేశ్వ‌రం అవినీతిపై బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి సంజ‌య్ అనేక పోసుగోలు క‌బుర్లు చెప్పాడ‌న్న ఆయ‌న‌.. దీనిని సీబీఐకి అప్ప‌గిస్తే.. 48 గంటల్లోనే రంగంలోకి అధికారుల‌ను దింపేలా చేస్తాన‌ని చెప్పార‌ని, కానీ, రోజులు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు-కిష‌న్‌రెడ్డికి మ‌ధ్య డీల్ కుదిరింద‌న్న రేవంత్ రెడ్డి.. ఆ క్ర‌మంలోనే సీబీఐని వేయాల‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేద‌న్నారు. కేటీఆర్‌కు, కిష‌న్ రెడ్డికి మ‌ధ్య ‘జిగిరీ దోస్త్‌’ ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయినా.. తాము ఊరుకునేది లేద‌న్నారు. సీబీఐని వెంటాడుతామ‌ని చెప్పారు.

లోకేష్ త‌మ్ముడైతే..

ఇదేస‌మ‌యంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. లోకేష్‌తో ఎందుకు క‌లిశార‌ని తాను ప్ర‌శ్నిస్తున్నాన‌న్నారు. అది కూడా చీక‌ట్లో ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింద‌న్నారు. గ‌తంలో లోకేష్‌ను త‌మ్ముడు అని చెప్పిన కేటీఆర్‌..తమ హ‌యాంలో చంద్ర‌బాబును అరెస్టు చేసిన‌ప్పుడు.. ఐటీ ఉద్యోగులు హైద‌రాబాద్‌లో నిర‌స‌న చేప‌ట్టార‌ని గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో త‌మ్ముడి బాధ గుర్తుకురాలేదా? అని ప్ర‌శ్నించారు. అప్పుడు ఐటీ ఉద్యోగుల‌పై చేసిన వ్యాఖ్య‌లు మ‌రిచిపోయావా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, త‌ను చేసిన వ్యాఖ్య‌ల‌కు, నారా లోకేష్‌కు సంబంధం లేద‌న్నారు. రాజ‌కీయంగా అనేక అంశాల‌పై మాట్లాడుతుంటామ‌ని చెప్పారు.

This post was last modified on September 20, 2025 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

52 seconds ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago