Political News

అమ‌రావ‌తికి మ‌రిన్ని నిధులు: కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి.. మ‌రిని నిధులు ఇప్పించేందుకు ముందుకు వ‌చ్చింది. అమరావతి నిర్మాణానికి వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌(ఏడీబీ) బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం.. అదనంగా రూ.14,200 కోట్ల రుణం పొందేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఈ మేర‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చిన‌ట్టు సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత సాధికార అధారిటీ) అధికారులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు మొత్తం అప్పుల కోసం.. వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులకు ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే దరఖాస్తు చేయనుంద‌ని వివ‌రించారు. దీంతో రాజ‌ధానికి మ‌రింత ఊపు రావడం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ ఏడాది ప్రారంభంలోనే వ‌రల్డ్ బ్యాంకు, ఏషియ‌న్ డెవ‌ల‌ప్ మెంటు బ్యాంకుల ద్వారా 15 వేల కోట్ల చొప్పున రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. దీనిని వార్షిక బ‌డ్జెట్‌లోనూ ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌భుత్వం ఆయా బ్యాంకుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 7 వేల కోట్ల చొప్పున రుణం తీసుకుంది.

అయితే.. రుణం ఇచ్చేముందు.. ఆయా బ్యాంకులు కొన్ని ష‌రతులు పెడుతున్నాయి. వాటికి లోబ‌డే నిధులు మంజూరు చేస్తున్నాయి. వాస్త‌వానికి రుణాలు ఇస్తున్నా.. తాము నిర్దేశించిన ప‌నుల‌కు మాత్ర‌మే ఆయా నిధుల‌ను వినియోగించాల‌ని కోరుతున్నాయి. ఇలా.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, డ్రైనేజీల ఏర్పాటుకు మాత్ర‌మే గ‌తంలో నిధులు మంజూరు చేశారు. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌ధాన నిర్మాణ ప‌నుల‌కు ఈ రుణాల మొత్తాన్నీ వినియోగించుకునే అవ‌కాశం లేకుండా పోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మంజూరు చేసే నిధుల‌ను ఇత‌ర నిర్మాణాల‌కు వినియోగించు కునేలా ఆయా బ్యాంకుల‌ను ఒప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. గ‌త కేంద్ర వార్షిక బ‌డ్జెట్లో అమ‌రావ‌తి కోసం 1400 కోట్ల రూపాయ‌ల‌ను గ్రాంటుగా ఇచ్చారు. వ‌చ్చే బ‌డ్జెట్లో దీనిని 3000 కోట్ల వ‌ర‌కు పెంచాల‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు విన్న‌వించారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర బ‌డ్జెట్‌లోనూ అమ‌రావ‌తి కోసం 2000 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు. దీంతో ప‌నులు వేగంగా సాగుతాయ‌ని ప్ర‌భుత్వం అంచనా వేస్తోంది. ఇక‌, 2028 నాటికి తొలి ద‌శ ప‌నులు పూర్తి చేయాల‌ని స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on September 19, 2025 6:51 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

18 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

31 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

42 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago