Political News

జోగి ర‌మేష్ అరెస్టు.. రీజ‌నేంటి?

వైసీపీ సీనియర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయ‌న‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. త‌న అరెస్టును జోగి త‌ప్పుబ‌ట్టారు. తాను ప్ర‌జ‌ల కోసం రోడ్డుమీద‌కు వ‌స్తే.. పోలీసులు అక్ర‌మార్కుల‌ను కాపాడేందుకు త‌నను అరెస్టు చేశార‌ని అన్నారు. ఇక‌, జోగి అరెస్టును నిర‌సిస్తూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ కిలో మీట‌ర్ల మేర నిలిచిపోయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్నంలో నివాసం ఉండే జోగి ర‌మేష్‌.. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. టీడీపీ నాయకులు కొండ‌ప‌ల్లి విద్యుత్ ఫ్యాక్ట‌రీ నుంచి ఉత్ప‌త్తి అవుతున్న బూడిద‌(ఫ్లై యాష్‌)ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారని .. దాని ద్వారా కోట్ల రూపాయ‌లు గ‌డిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. బూడిద నిల్వ‌ల‌ను ప‌రిశీలించేందుకు బ‌య‌లుదేరారు. అయితే.. పోలీసులు జోగిని ఆయ‌న అనుచ‌రుల‌ను అడ్డుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు అనుమ‌తులు లేకుండా ప‌రిశీల‌న చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జోగి త‌న అనుచ‌రుల‌తో కొండ‌ప‌ల్లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో ప‌లు మార్లు చెప్పి చూసిన పోలీసులు.. విధిలేని ప‌రిస్థితిలో అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే .. ఈ సంద‌ర్భంగా జోగి కూడా పోలీసులతో వాద‌న‌కు దిగారు. ఏ అధికారంతో త‌న‌ను అరెస్టు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న‌ను అరెస్టు చేసేందుకు కార‌ణాలు ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు.. టీడీపీ శ్రేణులు కూడా ఆందోళ‌న‌కు రెడీ అవడంతో పోలీసులు జోగిని అరెస్టు చేసి.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. దీంతో శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. ఫ‌లితంగా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది.

ఆది నుంచి ర‌గ‌డే!

మైల‌వ‌రం ఎమ్మెల్యేగా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు, వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగికి మ‌ధ్య వివాదం ఆది నుంచి ఉంది. రాజ‌కీయంగా కూడా ఇరు ప‌క్షాల మ‌ధ్య క‌త్తులు నూరుకునే స్థాయిలో వివాదాలు న‌డుస్తున్నాయి. గ‌తంలో మట్టి, ఇప్పుడు బూడిద‌ల‌ను ఎమ్మెల్యే దోచుకుంటున్నార‌ని జోగి ఆరోపిస్తున్నారు. గ‌తంలోనూ ఒక‌సారి వివాదం అయింది. త‌ర్వాత‌..జోగి కుమారుడిపై అగ్రి భూముల కేసు తెర‌మీద‌కు రావ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఇటీవ‌ల ఈ కేసులో కోర్టు జోగి కుమారుడిని త‌ప్పించింది. దీంతో మ‌రోసారి.. బూడిద‌ పేరుతో జోగి విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఎమ్మెల్యేను ల‌క్ష్యంగా చేసుకుని వివాదానికి తెర‌దీశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

2 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

2 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

4 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

5 hours ago