Political News

జోగి ర‌మేష్ అరెస్టు.. రీజ‌నేంటి?

వైసీపీ సీనియర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయ‌న‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. త‌న అరెస్టును జోగి త‌ప్పుబ‌ట్టారు. తాను ప్ర‌జ‌ల కోసం రోడ్డుమీద‌కు వ‌స్తే.. పోలీసులు అక్ర‌మార్కుల‌ను కాపాడేందుకు త‌నను అరెస్టు చేశార‌ని అన్నారు. ఇక‌, జోగి అరెస్టును నిర‌సిస్తూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ కిలో మీట‌ర్ల మేర నిలిచిపోయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్నంలో నివాసం ఉండే జోగి ర‌మేష్‌.. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. టీడీపీ నాయకులు కొండ‌ప‌ల్లి విద్యుత్ ఫ్యాక్ట‌రీ నుంచి ఉత్ప‌త్తి అవుతున్న బూడిద‌(ఫ్లై యాష్‌)ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారని .. దాని ద్వారా కోట్ల రూపాయ‌లు గ‌డిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. బూడిద నిల్వ‌ల‌ను ప‌రిశీలించేందుకు బ‌య‌లుదేరారు. అయితే.. పోలీసులు జోగిని ఆయ‌న అనుచ‌రుల‌ను అడ్డుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు అనుమ‌తులు లేకుండా ప‌రిశీల‌న చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జోగి త‌న అనుచ‌రుల‌తో కొండ‌ప‌ల్లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో ప‌లు మార్లు చెప్పి చూసిన పోలీసులు.. విధిలేని ప‌రిస్థితిలో అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే .. ఈ సంద‌ర్భంగా జోగి కూడా పోలీసులతో వాద‌న‌కు దిగారు. ఏ అధికారంతో త‌న‌ను అరెస్టు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న‌ను అరెస్టు చేసేందుకు కార‌ణాలు ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు.. టీడీపీ శ్రేణులు కూడా ఆందోళ‌న‌కు రెడీ అవడంతో పోలీసులు జోగిని అరెస్టు చేసి.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. దీంతో శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. ఫ‌లితంగా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది.

ఆది నుంచి ర‌గ‌డే!

మైల‌వ‌రం ఎమ్మెల్యేగా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు, వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగికి మ‌ధ్య వివాదం ఆది నుంచి ఉంది. రాజ‌కీయంగా కూడా ఇరు ప‌క్షాల మ‌ధ్య క‌త్తులు నూరుకునే స్థాయిలో వివాదాలు న‌డుస్తున్నాయి. గ‌తంలో మట్టి, ఇప్పుడు బూడిద‌ల‌ను ఎమ్మెల్యే దోచుకుంటున్నార‌ని జోగి ఆరోపిస్తున్నారు. గ‌తంలోనూ ఒక‌సారి వివాదం అయింది. త‌ర్వాత‌..జోగి కుమారుడిపై అగ్రి భూముల కేసు తెర‌మీద‌కు రావ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఇటీవ‌ల ఈ కేసులో కోర్టు జోగి కుమారుడిని త‌ప్పించింది. దీంతో మ‌రోసారి.. బూడిద‌ పేరుతో జోగి విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఎమ్మెల్యేను ల‌క్ష్యంగా చేసుకుని వివాదానికి తెర‌దీశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on September 17, 2025 3:27 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

2 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

4 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

5 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

6 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

6 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

7 hours ago