కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సాగిలపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “వాళ్లు మన మెతకతనం చూసి.. ఏవైనా కట్టుకుంటారు. అన్నింటికీ.. ఒప్పుకొంటామా?” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడేది లేదని చెప్పారు. చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని.. రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి ప్రధానమని తేల్చి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి పరోక్షంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. దీనికి కేంద్రం ఎలా ఒప్పుకొంటుందని ఆయన ప్రశ్నించారు.
“4 కోట్ల మంది ప్రజల గొంతులు ఎండబెట్టి.. వారికి(ఏపీ) నీళ్లు ఇస్తామంటే.. చూస్తూ ఊరుకుంటామా? అసరమైతే.. న్యాయ పోరాటం చేస్తాం.” అని రేవంత్ రెడ్డి చెప్పారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ హక్కులు ఎవరో దయాధర్మానికి ఇచ్చినవి కాదన్న ఆయన.. ఇవి తెలంగాణ ప్రజల హక్కులని.. వారికే దక్కాలని వ్యాఖ్యానించారు. నల్లగొండ సహా మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు.
దీనిని గత పాలకులు వినోదం చూసినట్టు చూశారని ఎద్దేవా చేశారు. కానీ, తమ ప్రభుత్వం ఖర్చుకు వెరవకుండా.. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అయినా.. ‘ఎస్ఎల్బీసీ’ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇక, హైదరాబాద్ను మరో ఉత్తమ స్థాయి(నెక్ట్స్ లెవిల్)కి తీసుకువెళ్తామని సీఎం స్పష్టం చేశారు. దీనిని గేట్ వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. దీంతో పాటు.. ఫ్యూచర్ సిటీని కూడా తమ హయాంలోనే పూర్తి చేస్తామని.. ఎప్పటికీ.. తెలంగాణ ప్రపంచంలో తలెత్తుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.
అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు..
This post was last modified on September 17, 2025 12:43 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…