Political News

జగనన్న కాలనీకి పవనన్న బ్రిడ్జి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండానే తన పని తాను సైలంట్ గా చేసుకుపోతున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్న పవన్ ఆయా ప్రాంతాల ప్రజల మన్ననలను చూరగొంటున్నారు. అంతేకాకుండా అంతకుముందు పాలించిన నేత పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని కూడా పవన్ పనితీరుతో జనం విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటుచేసుకుంది. జగనన్న కాలనీకి ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ పవన్ బ్రిడ్జి కట్టించారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వైసీపీ జమానాలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి, అందులో ఇల్లు కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇల్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలను వెనక్కు తీసుకుంటామని కూడా వైసీపీ నేతలు బెదిరించారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో అప్పులు చేసి మరీ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నారు. అయితే వాటికి కనీస మౌలిక సదుపాయల కల్పనను జగన్ సర్కారు మరిచింది. ఇక లబ్ధిదారులందరికీ ఒకే చోట స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ కాలనీలకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టేశారు. ఇలాంటి జగనన్న కాలనీ పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలులోనూ ఉంది. 1,500 ఇళ్లు ఇప్పటికే నిర్మాణం కాగా… వాటిలో లబ్దిదారులు నివాసం కూడా ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా… వర్షాకాలం వచ్చిందంటే చాలు గొల్లప్రోలు జగనన్న కాలనీ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేరు. పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేరు. ఎందుకంటే… జగనన్న కాలనీని గొల్లప్రోలుతో కలిపే మార్గంలో పెద్ద కాలువ ఉంది. ఎగువ భాగాన వర్షం పడినా ఈ కాలువ పొంగిపొరలుతుంది. ఇక గొల్లప్రోలు పరిధిలో వర్షం పడిందంటే.. ఇక జగనన్న కాలనీ వాసుల కష్టాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి పరిస్థితి గురించి తెలిసి వచ్చాకో, లేదంటే క్యాజువల్ గానే జగనన్న కాలనీకి వచ్చారో తెలియదు గానీ… గతేడాది సెప్టెంబర్ 9న పవన్ అక్కడికి వచ్చారు. పరిస్థితిని గమనించారు. అంతే… క్షణకాలం ఆలస్యం లేకుండా గొల్లప్రోలు, జగనన్న కాలనీల మధ్య బ్రిడ్జీ నిర్మించాలని తీర్మానించారు. అందుకు ఏకంగా రూ.5 కోట్ల నిధులను మంజూరు చేశారు.

ఏదో బ్రిడ్జిని మంజూరు చేయడం, నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతోనే తన పని అయిపోయిందని భావించని పవన్ అక్కడ పనులను యుద్దప్రాతిపదికన ప్రారంభమయ్యేలా చేశారు. పనుల్లో ఏమాత్రం వేగం తగ్గకుండా చూశారు. సరిగ్గా ఏడాదిలోనే అంటే ఈ సెప్టెంబర్ లోనే బ్రిడ్జి పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు కుంభవృష్టి పడ్డా, ఆ కాలువ మరింతగా పొంగిపొరలినా… పిల్లలు సంతోషంగా బ్రిడ్జిపై నుంచి తమ విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిపోతున్నారు. తిరిగి వస్తున్నారు. చిరుద్యోగులు వారి పనులకు విరామం లేకుండా వెళ్లగలుతున్నారు. ఇప్పుడు అక్కడికెళితే… జగన్ స్థలాలే ఇచ్చారు..ఆ స్థలాలకు అవసరమైన మౌలిక వసతులను పవన్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ అక్కడి జనం చెబుతున్నారు.

This post was last modified on September 16, 2025 1:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

9 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

35 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago