Political News

ఏపీలో కొత్త జిల్లాలు.. స‌రికొత్త సంగ‌తులు..!

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మార్పు చేసే దిశ‌గా స‌ర్కారు అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ నేతృత్వంలో స‌ర్కారు క‌మిటీని ఫామ్ చేసింది. ఈ క‌మిటీ కార్య‌క్ర‌మాలు కొంత మేర‌కు నెమ్మ‌దిగా సాగుతున్నాయి. అయితే.. వ‌చ్చే డిసెంబ‌రు 31 నాటికి పూర్తి చేయాల‌న్న డెడ్‌లైన్ ఉండ‌డంతో తాజాగా దీనిపై మ‌రోసారి దృష్టి పెట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు, సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ స‌భ వంటివి కొన‌సాగాయి. దీంతో మంత్రుల‌కు జిల్లాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేకుండా పోయింది.

ఇక, ఇప్పుడు వ‌చ్చే వారం రోజుల పాటు మంత్రులు జిల్లాల ఏర్పాటు, మార్పు, కూర్పుల‌పై దృష్టి పెట్టాల‌ని.. సీఎం చంద్ర‌బాబు నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో మంత్రులు మ‌ళ్లీ.. ప‌ని ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా చింతూరు జిల్లాను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు తెలిసింది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు సుదీర్ఘ దూరంలో ఉంది. సుమారు మూడు గంట‌ల పాటు ప్ర‌యాణిస్తే త‌ప్ప‌.. వెళ్లే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు చెప్ప‌డంతో ప్ర‌త్యేకంగా జిల్లా ఏర్పాటుకు రంగం రెడీ అవుతోంది.

దీని ప్ర‌కారం.. రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని 4 విలీన మండలాలు కలిపి.. చింతూరు లేదా.. రంప‌చోడ‌వ‌రం పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి.. ‘మార్కాపురం’ జిల్లా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ జిల్లాలో గిద్దలూ రు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు ఉండ‌నున్నాయి. వాస్త‌వానికి గ‌తంలోనే మార్కాపురం ప్ర‌త్యేక జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఉన్నా.. వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌న్న విష‌యం తెలిసిందే.

ఇక‌, అద్దంకి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌కాశం జిల్లాలో విలీనం చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతో కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలతో ప్ర‌కాశం జిల్లా ఏర్ప‌డుతుంది. ఇదిలావుంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌త్యేక జిల్లాగా మార్చాల‌ని నిర్ణ‌యించారు. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్‌ జిల్లా ఏర్పాటు చేస్తారు. దీనిలో రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు వస్తాయి. అదేవిధంగా పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు కూడా ఈ ‘అమ‌రావ‌తి జిల్లా’లో క‌ల‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓ ప‌ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంద‌ని అధికారులు చెబుతున్నారు.

This post was last modified on September 13, 2025 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

3 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

4 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

5 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

6 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

6 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

6 hours ago