భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగానికి ఇప్పటిదాకా అధ్యక్షులుగా చేసిన వాళ్లలో ఎవరూ లేనంతగా చాలా తక్కువ సమయంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బండి సంజయ్. గత ఏడాది కరీం నగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన సంజయ్లోని దూకుడు చూసి అధిష్టానం ఆయన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని చేసింది. సంజయ్ ఆ దూకుడుతోనే పార్టీకి ఊపు తెచ్చిన మాట వాస్తవం.
కానీ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, అవగాహన లేని మాటలతో అదే స్థాయిలో అన్ పాపులర్ కూడా అయ్యారు సంజయ్. ముఖ్యంగా ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘చలాన్ల రద్దు’ సహా పలు కామెంట్లతో బండి సంజయ్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆయన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో బండి సంజయ్కు ప్రాధాన్యం కూడా తగ్గించేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంజయ్ అలక పాన్పు ఎక్కినట్లు వార్తలొస్తున్నాయి.
ఓవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమో బండి సంజయ్ తాను చెప్పిన వాళ్లకు టికెట్ ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు తాను చెప్పిన వాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడంతో సంజయ్ హర్టయినట్లు సమాచారం. కరీంనగర్ ఎంపీ అయిన సంజయ్కు హైదరాబాద్ వ్యవహారాలు ఏం తెలుస్తుందంటూ ఆయన్ని టికెట్ల ఎంపికలో పక్కన పెట్టారట. కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కలిసి మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారట.
దీనికి తోడు ఇటీవలి వివాదాస్పద కామెంట్ల నేపథ్యంలో సంజయ్కు కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారని.. చివరగా ఇద్దరూ కలిసి పాల్గొన్న సమావేశంలో ఎడమొహం పెడమొహంగా ఉండటానికి ఇదే కారణమని.. ఒక దశలో కిషన్ రెడ్డి వ్యవహార శైలితో మనస్తాపానికి గురైన సంజయ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అన్నారని.. ఐతే ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఇలా చేస్తే, విభేదాలు బయటపడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం.
This post was last modified on November 24, 2020 5:37 pm
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…