ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు అన్ని ఆలోచనలూ మానేసి ఆయన మాటలు అలా వింటూ ఉండిపోతారు. అంత సమ్మగా ఉంటాయి ఆయన మాటలు. తెలుగు రాష్ట్రాల్లోని నాయకుల్లో కేసీఆర్ను మించిన వక్త మరొకరు లేరనడంలో మరో మాటే లేదు. ఆయన ప్రెస్ మీట్లలో వాగ్బాణాలు, విమర్శలు, పంచ్ డైలాగులకు కొదవే ఉండదు.
ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను మరీ తేలిక చేస్తూ వేసే కౌంటర్లు భలేగా ఉంటాయి. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన లాజిక్ మరిచిపోతుంటారు. జనాలు తాను ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారు. కొన్ని కామెంట్లు తనకు బూమరాంగ్ అవుతాయని తెలిసినా సరే.. ఆ సమయానికి కౌంటర్ వేసేస్తుంటారు అంతే.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
అంతటితో ఆగకుండా తమ పార్టీకే ఎందుకు ఓటేయాలో కొన్ని కారణాలు చెప్పారాయన. టీఆర్ఎస్ మళ్లీ గెలవకపోయినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని అన్నారు. ఇందుకు రీజనింగ్ ఏంటో చెప్పలేదు. అంతటితో ఆగకుండా తాము అధికారంలో ఉండగా.. వేరే పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది హైదరాబాద్కు మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి జరగదని.. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాబట్టి బీజేపీ గెలిస్తే వేస్ట్ అని తేల్చేశారు. తద్వారా జీహెచ్ఎంసీని బీజేపీ చేజిక్కించుకుంటే తాము సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు.
కానీ ఇదే లాజిక్ కేంద్రం-రాష్ట్రం విషయంలో అప్లై చేసి చూస్తే ఎవరూ టీఆర్ఎస్కు ఓటే వేయకూడదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ వేరే పార్టీకి అధికారం కట్టబెడితే వాళ్లు సహకరించరు కాబట్టి అభివృద్ధి జరగదని.. కాబట్టి బీజేపీకే ఓటేయాలని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ అన్న మాటల్ని గుర్తు చేస్తూ రేప్పొద్దున సార్వత్రిక ఎన్నికలపుడు టీఆర్ఎస్కు ఓటేయడం వేస్ట్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఊరుకుంటారా?
This post was last modified on November 24, 2020 5:35 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…