ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు అన్ని ఆలోచనలూ మానేసి ఆయన మాటలు అలా వింటూ ఉండిపోతారు. అంత సమ్మగా ఉంటాయి ఆయన మాటలు. తెలుగు రాష్ట్రాల్లోని నాయకుల్లో కేసీఆర్ను మించిన వక్త మరొకరు లేరనడంలో మరో మాటే లేదు. ఆయన ప్రెస్ మీట్లలో వాగ్బాణాలు, విమర్శలు, పంచ్ డైలాగులకు కొదవే ఉండదు.
ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను మరీ తేలిక చేస్తూ వేసే కౌంటర్లు భలేగా ఉంటాయి. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన లాజిక్ మరిచిపోతుంటారు. జనాలు తాను ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారు. కొన్ని కామెంట్లు తనకు బూమరాంగ్ అవుతాయని తెలిసినా సరే.. ఆ సమయానికి కౌంటర్ వేసేస్తుంటారు అంతే.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
అంతటితో ఆగకుండా తమ పార్టీకే ఎందుకు ఓటేయాలో కొన్ని కారణాలు చెప్పారాయన. టీఆర్ఎస్ మళ్లీ గెలవకపోయినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని అన్నారు. ఇందుకు రీజనింగ్ ఏంటో చెప్పలేదు. అంతటితో ఆగకుండా తాము అధికారంలో ఉండగా.. వేరే పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది హైదరాబాద్కు మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి జరగదని.. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాబట్టి బీజేపీ గెలిస్తే వేస్ట్ అని తేల్చేశారు. తద్వారా జీహెచ్ఎంసీని బీజేపీ చేజిక్కించుకుంటే తాము సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు.
కానీ ఇదే లాజిక్ కేంద్రం-రాష్ట్రం విషయంలో అప్లై చేసి చూస్తే ఎవరూ టీఆర్ఎస్కు ఓటే వేయకూడదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ వేరే పార్టీకి అధికారం కట్టబెడితే వాళ్లు సహకరించరు కాబట్టి అభివృద్ధి జరగదని.. కాబట్టి బీజేపీకే ఓటేయాలని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ అన్న మాటల్ని గుర్తు చేస్తూ రేప్పొద్దున సార్వత్రిక ఎన్నికలపుడు టీఆర్ఎస్కు ఓటేయడం వేస్ట్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఊరుకుంటారా?
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…