Political News

నేపాల్‌లో తెలుగు వారికి లోకేష్ భ‌రోసా!

ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతున్న భార‌త్ పొరుగు దేశం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భ‌రోసా క‌ల్పించారు. తాజాగా అక్క‌డ చిక్కుకున్న వారితో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు.

తొలిసారి అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వ‌చ్చిన లోకేష్‌.. తొలుత అధికారుల‌తో మాట్లాడారు. నేపా ల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే.. అధికా రుల బృందాన్ని అక్క‌డ‌కు పంపించేందుకు సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చిస్తాన‌ని చెప్పారు. అమ‌రావ‌తిలో ప్ర‌త్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివ‌రాల‌ను సేక‌రించి.. వారి బంధు వుల‌కు అందించాల‌ని సూచించారు.

అనంత‌రం.. నేపాల్‌లో చిక్కుకున్న విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “అధైర్య పడొద్దు.. మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది” అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామ‌ని చెప్పారు. ప్రతి రెండుగంటలకోసారి నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ప్ర‌భుత్వం అందుబాటులో ఉంటుంద‌న్నారు. ఆందోళన చెందవద్దని తెలిపారు.

ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే.. ప్ర‌త్యేక అధికారుల బృందాన్ని ఖట్మాండుకు పంపించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కోరారు. దీనిపై సీఎంతో తాను చ‌ర్చిస్తాన‌న్నారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డి వారికి ధైర్యం చెప్పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్రంతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on September 10, 2025 12:54 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

1 hour ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

5 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

7 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

7 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

8 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

9 hours ago