Political News

నేపాల్‌లో తెలుగు వారికి లోకేష్ భ‌రోసా!

ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతున్న భార‌త్ పొరుగు దేశం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భ‌రోసా క‌ల్పించారు. తాజాగా అక్క‌డ చిక్కుకున్న వారితో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు.

తొలిసారి అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వ‌చ్చిన లోకేష్‌.. తొలుత అధికారుల‌తో మాట్లాడారు. నేపా ల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే.. అధికా రుల బృందాన్ని అక్క‌డ‌కు పంపించేందుకు సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చిస్తాన‌ని చెప్పారు. అమ‌రావ‌తిలో ప్ర‌త్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివ‌రాల‌ను సేక‌రించి.. వారి బంధు వుల‌కు అందించాల‌ని సూచించారు.

అనంత‌రం.. నేపాల్‌లో చిక్కుకున్న విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “అధైర్య పడొద్దు.. మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది” అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామ‌ని చెప్పారు. ప్రతి రెండుగంటలకోసారి నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ప్ర‌భుత్వం అందుబాటులో ఉంటుంద‌న్నారు. ఆందోళన చెందవద్దని తెలిపారు.

ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే.. ప్ర‌త్యేక అధికారుల బృందాన్ని ఖట్మాండుకు పంపించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కోరారు. దీనిపై సీఎంతో తాను చ‌ర్చిస్తాన‌న్నారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డి వారికి ధైర్యం చెప్పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్రంతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

2 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

5 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

7 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

7 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

7 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

8 hours ago