ప్రస్తుతం అంతర్గత సంక్షోభంతో అల్లాడుతున్న భారత్ పొరుగు దేశం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా కల్పించారు. తాజాగా అక్కడ చిక్కుకున్న వారితో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు.
తొలిసారి అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చిన లోకేష్.. తొలుత అధికారులతో మాట్లాడారు. నేపా ల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. అవసరమైతే.. అధికా రుల బృందాన్ని అక్కడకు పంపించేందుకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. అమరావతిలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించి.. వారి బంధు వులకు అందించాలని సూచించారు.
అనంతరం.. నేపాల్లో చిక్కుకున్న విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “అధైర్య పడొద్దు.. మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది” అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రతి రెండుగంటలకోసారి నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. ఆందోళన చెందవద్దని తెలిపారు.
ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అవసరమైతే.. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఖట్మాండుకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీనిపై సీఎంతో తాను చర్చిస్తానన్నారు. అయితే.. అప్పటి వరకు అక్కడి వారికి ధైర్యం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై కేంద్రంతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
This post was last modified on September 10, 2025 12:54 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…