ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్లు సినిమాల్లో నటించకూడదా? అలా నటించటం చట్ట విరుద్ధమా?అన్న ప్రశ్నలకు ఇప్పటికే ఇచ్చిన తీర్పుల ప్రకారం.. అలాంటిదేమీ కనిపించదు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ హైకోర్టుకు తెలియజేశారు అడ్వొకేట్ జనరల్ దమ్మలాపాటి శ్రీనివాస్. ఇంతకూ ఏం జరిగిందంటే.. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ వాదన ఏమంటే.. ఏపీకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కారణం.. హరిహర వీరమల్లు సినిమా.. వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ తన వాదనల్ని వినిపిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి.. సీనియర్ నటుడు దివంగత ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్త్రత ధర్మాసనం గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాదు.. పిటిషనర్ పేర్కొన్నట్లుగా హరిహర వీరమల్లు మూవీ టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర ఉన్నట్లుగా చెప్పే ఏ ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదన్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫు లాయర్ స్పందిస్తూ.. సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి.. రిప్లై వాదనలు చెబుతామని.. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరటంతో.. ఈ కేసు విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
This post was last modified on September 9, 2025 2:11 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…