Political News

ఎవ‌రు ఎటువైపు: రేపు ఉప‌రాష్ట్ర‌ప‌తి పోరు!

దేశ రెండో పౌరుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. మంగ‌ళ‌వారం(ఈ నెల 9) పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఎన్నిక‌లో రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌లోని స‌భ్యుల‌తోపాటు.. నామినేటెడ్ స‌భ్యులు కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. అస‌లు కాక తాజాగా ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ఎన్డీయే ప‌క్షాల త‌ర‌ఫున మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ బ‌రిలో ఉన్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూట‌మి త‌ర‌ఫున సుప్రీంకోర్టు మాజీన్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీలో ఉన్నారు.

స‌మీక‌ర‌ణ‌లు మారాయా?

ఇక‌, తాజా ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఎన్డీయే ప‌క్షానికే బ‌లం క‌నిపిస్తోంది. ఉభ‌య స‌భ‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట మికి 425 మంది స‌భ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్ విజ‌యం దాదాపు ఖ‌రారైంద‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి ఇరు స‌భ‌ల్లోనూ 311 మంది స‌భ్యుల మద్ద‌తు ఉంది. అయి తే.. ఈ రెండు కూట‌ముల మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తున్నా.. చివ‌రి నిముషంలో స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ గ‌త రెండు రోజులుగా జాతీయ రాజ‌కీయ వ‌ర్గాల్లో చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం మ‌రో 45 మంది స‌భ్యులు త‌ట‌స్థంగా ఉన్నారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంఐఎం, వైసీపీ వంటివి ఉన్నాయి.

ఈ 45 మందిలో వైసీపీ ఎన్డీయేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా.. మ‌రికొంద‌రు మాత్రం ఎటువైపైనా చివ‌రి నిముషంలో మార్పులు చేర్పులు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే స‌మీక‌ర‌ణ‌ల మార్పుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. ఇక‌, మ‌రో రీజ‌న్‌.. క్రాస్ ఓటింగ్‌. లేదా.. వేసిన ఓట్లు చెల్లుబాటు కాక‌పోవ‌డం. ఈ విష‌యంపై కూడా జాతీయ స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. సాధార‌ణ పోలింగ్‌గా కాకుండా ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ భిన్నంగా ఉంటుంది. ఎంపీలు.. త‌మ ఓట్ల‌ను మురిగిపోకుండా.. జాగ్ర‌త్త‌గా వేయాలి. ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా మురిగిపోతుంటాయి. ఈ విష‌యంలోనూ కూట‌మి పార్టీలు శ్ర‌ద్ధ తీసుకుంటున్నాయి.

ఎంఐఎం చ‌క్రం..

హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఓవైసీ ఇండీ కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌లిసి వ‌చ్చే అంశంగా మారింది. అయితే.. ఈ పార్టీకి సంఖ్యా బ‌లం లేకున్నా.. ఇత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఇక‌, వైసీపీ కూడా అంత‌ర్గ‌తంగా ఎంఐఎం పార్టీ వైపు న‌డిచే అవ‌కాశం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే.. ఇండీ కూట‌మిలో ఒకింత ఆశ‌లు రేకెత్తుతున్నాయి. మ‌రోవైపు.. ఇండీ కూట‌మి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్ రెడ్డి సెంటిమెంటు దిశ‌గా చేసిన వ్యాఖ్య‌లు కూడా ప‌లువురు ఎంపీల‌ను పార్టీల‌కు అతీతంగా త‌మ‌కు అనుకూలంగా మార్చే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా ఇండీ కూట‌మిలో వినిపిస్తోంది. ఏదేమైనా.. మంగ‌ళ‌వారం జ‌రిగే ఎన్నిక‌ల పోరు.. ఆస‌క్తి రేపుతోంది.

This post was last modified on September 8, 2025 11:14 am

Share
Show comments

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

22 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

5 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

7 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

12 hours ago