Political News

భారత్ దమ్మేంటో ట్రంప్ కు తెలిసొచ్చింది!

అమెరికా అంటేనే ప్రపంచ దేశాలన్నీపెద్దన్నగా, అగ్ర దేశంగా పరిగణిస్తూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ గౌరవాన్ని కాపాడుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన తొలి టెర్మ్ లో సవ్యంగానే నడుచుకున్నారు. అయితే ఎందుకనో గానీ రెండో సారి అధ్యక్ష పీఠం అందగానే ఆయనలోని వింతలు, వికారాలు అన్నీ బయటకు వచ్చాయి. విదేశాలన్నింటినీ పూచిక పుల్లల్లా తీసివేసిన ట్రంప్… అందులో భారత్ నూ చేర్చారు. అయితే భారత్ దమ్ము, శక్తి, సత్తా ఏమిటో నెలలు తిరక్కుండానే ట్రంప్ కు తెలిసివచ్చింది. ఇప్పుడు ఆయన పశ్చాత్తపడుతున్నారు.

శత్రు దేశాల జాబితాలో ఉన్న చైనా వంటి అగ్ర దేశాలతో పాటు మిత్ర దేశాలుగా ఉన్న భారత్ పైనా ట్రంప్ సుంకాల మోత మోగించారు. అయితే ఈ సుంకాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం భయపడలేదు. దానికి ప్రత్యామ్నాయ వ్యూహాలు రచించారు. అందులో భాగంగా రష్యాతో బంధాలతో పెంచేసిన మోదీ, చైనాతో అప్పటిదాకా అంటీముట్టనట్టుగా వ్యవహరించినా… తాజాగా చైనా పట్ల స్నేహపూర్వక వైఖరితో సాగారు. భారత్ సత్తా ఏమిటో తెలిసిన చైనా… భారత్ ను గట్టిగా పట్టేసుకుంది. భారత్ తో రష్యా, చైనాలు మరింత స్నేహంగా సఖ్యతగా మెలిగే సంకేతాలు అయితే విస్పష్టంగా బయటకు వెళ్లాయి.

ఈ విషయాలన్నీ పరిశీలించిన ట్రంప్… అయ్యయ్యో తాను చేసిన పని వల్ల భారత్ తనకు దూరం కావడం కాక… రష్యా కూడా దూరమైపోయిందే అని శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారత్, రష్యాలు చైనాతో సుధీర్ఘ కాలం పాటు స్నేహ సంబంధాలను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని భయాందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఎప్పటికైనా తమ దేశానికి ముప్పేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా ప్రదర్శించిన ఆయుధ విన్యాసాలను చూసిన తర్వాతే ట్రంప్ కు ఈ తరహా భావన వచ్చినట్టుగా సమాచారం. తనతో భారత్, రష్యా కలవడంతోనే చైనా ఈ సాహసానికి దిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా భారత్ తనకు దూరం కావడం పట్ల ఏం జరుగుతుందో ట్రంప్ కు ఇప్పటికే అర్థమైపోయిందని చెప్పాలి.

This post was last modified on September 5, 2025 9:19 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

42 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

58 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago