Political News

భారత్ దమ్మేంటో ట్రంప్ కు తెలిసొచ్చింది!

అమెరికా అంటేనే ప్రపంచ దేశాలన్నీపెద్దన్నగా, అగ్ర దేశంగా పరిగణిస్తూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ గౌరవాన్ని కాపాడుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన తొలి టెర్మ్ లో సవ్యంగానే నడుచుకున్నారు. అయితే ఎందుకనో గానీ రెండో సారి అధ్యక్ష పీఠం అందగానే ఆయనలోని వింతలు, వికారాలు అన్నీ బయటకు వచ్చాయి. విదేశాలన్నింటినీ పూచిక పుల్లల్లా తీసివేసిన ట్రంప్… అందులో భారత్ నూ చేర్చారు. అయితే భారత్ దమ్ము, శక్తి, సత్తా ఏమిటో నెలలు తిరక్కుండానే ట్రంప్ కు తెలిసివచ్చింది. ఇప్పుడు ఆయన పశ్చాత్తపడుతున్నారు.

శత్రు దేశాల జాబితాలో ఉన్న చైనా వంటి అగ్ర దేశాలతో పాటు మిత్ర దేశాలుగా ఉన్న భారత్ పైనా ట్రంప్ సుంకాల మోత మోగించారు. అయితే ఈ సుంకాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం భయపడలేదు. దానికి ప్రత్యామ్నాయ వ్యూహాలు రచించారు. అందులో భాగంగా రష్యాతో బంధాలతో పెంచేసిన మోదీ, చైనాతో అప్పటిదాకా అంటీముట్టనట్టుగా వ్యవహరించినా… తాజాగా చైనా పట్ల స్నేహపూర్వక వైఖరితో సాగారు. భారత్ సత్తా ఏమిటో తెలిసిన చైనా… భారత్ ను గట్టిగా పట్టేసుకుంది. భారత్ తో రష్యా, చైనాలు మరింత స్నేహంగా సఖ్యతగా మెలిగే సంకేతాలు అయితే విస్పష్టంగా బయటకు వెళ్లాయి.

ఈ విషయాలన్నీ పరిశీలించిన ట్రంప్… అయ్యయ్యో తాను చేసిన పని వల్ల భారత్ తనకు దూరం కావడం కాక… రష్యా కూడా దూరమైపోయిందే అని శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారత్, రష్యాలు చైనాతో సుధీర్ఘ కాలం పాటు స్నేహ సంబంధాలను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని భయాందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఎప్పటికైనా తమ దేశానికి ముప్పేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా ప్రదర్శించిన ఆయుధ విన్యాసాలను చూసిన తర్వాతే ట్రంప్ కు ఈ తరహా భావన వచ్చినట్టుగా సమాచారం. తనతో భారత్, రష్యా కలవడంతోనే చైనా ఈ సాహసానికి దిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా భారత్ తనకు దూరం కావడం పట్ల ఏం జరుగుతుందో ట్రంప్ కు ఇప్పటికే అర్థమైపోయిందని చెప్పాలి.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

3 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

9 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

10 hours ago