Political News

ప‌నిమంతుడు: పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోని పెమ్మ‌సాని…!

రాజ‌కీయాల్లో ఉన్న వారికి ప‌ని ఎలా ఉన్నా.. పొగ‌డ్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. నువ్వంతంటే.. నువ్వింత .. అని అనేవారిని అక్కున చేర్చుకుని మ‌చ్చిక చేసుకునేందుకు నాయ‌కులు ఫ‌స్ట్ ప్రియార్టీఇస్తున్నారు. రాజకీయాలు ఒక‌ప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు నేత‌ల‌ను పొగ‌డ‌క‌పోతే.. ప‌నులు జ‌రిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. అంద‌రూ అలానే ఉంటారా? అంటే.. ఒక‌రిద్ద‌రు పొగ‌డ్త‌ల‌కు దూరంగా కూడా ఉంటా రు. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ పేరు మార్మోగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఫ‌స్ట్ టైమ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఫ‌స్ట్ టైమ్ గుంటూరు ఎంపీ సీటును ద‌క్కించుకున్న పెమ్మ సాని చంద్ర‌శేఖ‌ర్‌.. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈయ‌న త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నంలోనూ ఉన్నారు. అయితే.. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌లు.. ఈయ‌న‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేంద్రంలో కూడా చ‌క్రం తిప్పుతున్న నేప‌థ్యంలో ఈయ‌న‌ను మ‌చ్చిక చేసుకుంటే.. త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని వారు భావిస్తున్నారు.

ఇటీవ‌ల మంత్రి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని భారీ కార్య‌క్ర‌మానికి ఓ నాయ‌కుడు ప్ర‌య‌త్నించారు. ఈయ‌న ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ కూడా. రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు కాంట్రాక్టు ప‌నులు చేస్తుంటారు. దీంతో త‌న ప‌నుల కోస‌మైనా.. ఆయ‌న నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారనే పేరుంది. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన గ‌ల్లా జ‌య‌దేవ్‌ను కూడా స‌ద‌రు నేతే.. ఆకాశానికి ఎత్తేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. పుట్టిన రోజుల సంద‌ర్భంగా భారీ యాడ్స్ ఇవ్వ‌డం.. ఘ‌న స‌న్మానాలు చేయ‌డంలో దిట్ట‌గా కూడా పేరుంది.

ఇప్పుడు ఆయ‌నే పెమ్మ‌సానిని కూడా మంచి చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రెండు రోజుల కింద‌ట ఘ‌న స‌న్మానం చేయాల‌ని ఏర్పాట్లు చేసుకున్నారు.. కానీ, ఈ విష‌యం తెలిసిన కేంద్ర మంత్రి.. త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. స‌న్మానాలు.. స‌త్కారం త‌న‌కు అవ‌సరం లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో పీ-4 కింద ఓ రెండు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని ఆయ‌న మేలైన సూచ‌న చేశార‌ట‌.

అయితే.. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ మాత్రం స‌న్మానం వైపే మొగ్గు చూప‌డంతో కేంద్ర మంత్రి ఇలా అయితే.. ఇక నుంచి నా ప‌ర్య‌ట‌న‌ల‌కు మీరు రావొద్ద‌ని తేల్చి చెప్పేయ‌డంతో ఇప్పుడు ఆ కాంట్రాక్ట‌ర్ త‌న ప‌నితీరు మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. మొత్తానికి ప‌నితీరుకే పెద్ద పీట వేసే నాయ‌కులు క‌నుమ‌రుగుతున్న స‌మ‌యంలో పెమ్మసాని త‌నేంటో చూపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 5, 2025 6:52 pm

Share

Recent Posts

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

1 hour ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

2 hours ago

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…

4 hours ago

విశ్వనాథ్ వసూళ్లకు కుటుంబాలే కీలకం

ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా…

4 hours ago

తెలివిగా ‘గేమ్’ తప్పించుకున్న దుల్కర్

పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…

4 hours ago

మార్పు త‌ప్ప‌దు మిత్ర‌మా… కూట‌మి తేల్చేసింది!

కూట‌మిలో నాయ‌కుల‌కు క‌లివిడిత‌ప్ప‌దు. ఈ విష‌యాన్ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీడీపీ-జ‌న‌సేన కూడా స్ప‌ష్టం చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కులు…

4 hours ago