Political News

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్య శ్రీ పథకం పౌరుల ఆర్థిక స్థితిగతులను బట్టి అమలవుతోంది. దీంతో, రాష్ట్రంలోని పౌరులందరికీ ఆ పథకం ప్రయోజనం లభించడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ వర్తించేలా ఉచిత ఆరోగ్య బీమా పథకం తీసుకువస్తానని హామీనిచ్చింది. ఈ క్రమంలోనే ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఏపీలోని చంద్రబాబు సర్కార్ అడుగులు వేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటీలో ఈ పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా లభించనుంది. రాష్ట్రంలోని 2493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో రూ.25 లక్షల రూపాయల వరకు ఉచితంగా 3257 వైద్య సేవలు ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. ఈ పాలసీ వల్ల ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అంతేకాదు, 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అమలుకు అనుమతులు లభించేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాంతోపాటు, రెండున్నర లక్షల రూపాయలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ను ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వైద్య చికిత్సల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. దీంతోపాటు, పీపీపీ విధానంలో ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.

This post was last modified on September 4, 2025 3:53 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago