టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమను టార్గెట్గా చేసుకొని రాజకీయంగా అడుగులు మరింత వేగం పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ఈనెల 10వ తారీఖున నిర్వహించే సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించి ఉంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది అన్నది మొదట్లో చర్చకు వచ్చింది. ఈ విషయంపై చంద్రబాబు కూడా చూచాయిగా సమాచారం అందించారు.
కానీ, అనూహ్యంగా రాయలసీమను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు కూడా రాయలసీమలోనే నిర్వహించారు. పైగా జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి హవా కొనసాగింది. అంటే ఒక రకంగా రాయలసీమలో మహానాడు నుంచి చూసుకుంటే పార్టీ హవా కనిపిస్తోంది. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు పెరిగాయి.
ఈ క్రమంలో ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా అనంతపురంలో నిర్వహించడం ద్వారా రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం, రాయలసీమలో మరింత దూకుడుగా వ్యవహరించటం అనే లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే రాయలసీమ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా రాయలసీమను వేదికగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా రాయలసీమలోనే అనేక పరిశ్రమలు తీసుకువచ్చింది.
ఇటీవల కృష్ణ నీళ్లను కూడా తీసుకురావడం.. విండ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమా లు చేపట్టింది. తద్వారా రాయలసీమలో బలమైన వైసీపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి సీమలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు సొంతం. అయితే.. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగలు వేస్తున్నారనేది.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇక, ఇప్పటికిప్పుడు.. వైసీపీకి ఎలాంటి నష్టం లేదని భావించినా.. భవిష్యత్తులో మాత్రం టీడీపీ పుంజుకుంటున్న తీరుతో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on September 4, 2025 3:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…