టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమను టార్గెట్గా చేసుకొని రాజకీయంగా అడుగులు మరింత వేగం పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ఈనెల 10వ తారీఖున నిర్వహించే సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించి ఉంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది అన్నది మొదట్లో చర్చకు వచ్చింది. ఈ విషయంపై చంద్రబాబు కూడా చూచాయిగా సమాచారం అందించారు.
కానీ, అనూహ్యంగా రాయలసీమను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు కూడా రాయలసీమలోనే నిర్వహించారు. పైగా జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి హవా కొనసాగింది. అంటే ఒక రకంగా రాయలసీమలో మహానాడు నుంచి చూసుకుంటే పార్టీ హవా కనిపిస్తోంది. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు పెరిగాయి.
ఈ క్రమంలో ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా అనంతపురంలో నిర్వహించడం ద్వారా రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం, రాయలసీమలో మరింత దూకుడుగా వ్యవహరించటం అనే లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే రాయలసీమ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా రాయలసీమను వేదికగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా రాయలసీమలోనే అనేక పరిశ్రమలు తీసుకువచ్చింది.
ఇటీవల కృష్ణ నీళ్లను కూడా తీసుకురావడం.. విండ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమా లు చేపట్టింది. తద్వారా రాయలసీమలో బలమైన వైసీపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి సీమలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు సొంతం. అయితే.. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగలు వేస్తున్నారనేది.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇక, ఇప్పటికిప్పుడు.. వైసీపీకి ఎలాంటి నష్టం లేదని భావించినా.. భవిష్యత్తులో మాత్రం టీడీపీ పుంజుకుంటున్న తీరుతో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on September 4, 2025 3:04 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…