అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా నానుస్తున్నారు అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన విమర్శలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై గతంలో హత్య కేసు నమోదయింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన చెబుతున్నప్పటికీ ఆధారాలు ఉన్నాయి అని పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై స్టే కోరుతూ ఇప్పటికే 7 సార్లు ఆయన హైకోర్టును ఆశ్రయించడం, ఆరుసార్లు స్టే ఇవ్వడం జరిగాయి. ఇప్పుడు ఏడోసారి ఈ కేసులో స్టే కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే అయినంత మాత్రాన కేసుల నుంచి బయట పడలేరని, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అసలు రాజకీయాల్లోకి ఎలా తీసుకున్నారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి ఏం చెప్తారు అని కూడా నిలదీసింది.
ఇక.. స్టే ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికి ఎప్పుడు స్టే ఇవ్వలేమని పేర్కొంటూ రెండు రోజుల కిందట కేసు వాయిదా వేసింది. దీంతో ఏం జరుగుతుందనేది ఇప్పుడు టిడిపి నాయకులలోను ఎమ్మెల్యే అనుచరులలోను చర్చ జరుగుతోంది. వాస్తవానికి హత్య కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రంలో కొందరు ఉన్నారు. అయినప్పటికీ వెంకటేశ్వర ప్రసాద్ పై హైకోర్టు ఎంత తీవ్రంగా స్పందించేసరికి టిడిపి నాయకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
రేపు ఈ కేసులో స్టే కనక ఇవ్వకపోతే ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా ఇది టిడిపికి ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికి ఇప్పుడైతే దగ్గుబాటి చుట్టూ ఈ కేసు తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ కేసుపై మంతనాలు చేస్తున్నారు. సీనియర్ లాయర్లను నియమించాలని కూడా చెప్పినట్టు తెలిసింది.
This post was last modified on September 4, 2025 12:06 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…