భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఎమ్మెల్యే అంటే రాజా సింగ్యే. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాల్ని నరనరాన నింపుకుని ఉత్తరాదిన ఆ పార్టీ నాయకుల తరహాలో ఇక్కడ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు రాజా సింగ్. అందుకే ఆయనకు ‘టైగర్’ రాజా సింగ్ అని పేరు కూడా వచ్చింది.
పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా తనకు తానుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే వ్యక్తి అతను. పార్టీకి చాలా విధేయుడిగా కనిపించే రాజా సింగ్.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం టీఆర్ఎస్తో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా వార్తల్లోకెక్కాడు. బండి సంజయ్ తనను మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడెలా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో మాత్రం తాను చెప్పిన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని బండి సంజయ్కు ముందే చెప్పానని.. అందుకు సరే అన్న ఆయన.. ఇప్పుడు తనను మోసం చేసి వేరే వ్యక్తులకు టికెట్లు ఇచ్చాడని ఆరోపించాడు రాజా సింగ్. గోషా మహల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎంతో కష్టపడ్డ కార్యకర్తకు టికెట్ ఇప్పించుకోలేకపోయానని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో బండి సంజయ్ సహా పార్టీ సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. రెండు మూడు రోజుల్లో పార్టీ జాతీయ అధినాయకత్వానికి ఇక్కడి పరిస్థితులపై పూర్తి వివరాలతో లేఖ రాయబోతున్నానని బండి సంజయ్ వెల్లడించాడు. దుబ్బాక ఉప ఎన్నికల విజయం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పార్టీలో మంచి పేరున్న ఎమ్మెల్యే నుంచి ఇలాంటి విమర్శలు, ఆరోపణలు రావడం బీజేపీకి ఇబ్బందికరమే.
This post was last modified on November 23, 2020 3:37 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…