Political News

‘మీరంతా స‌క్రంగా ప‌నిచేసి ఉంటే.. మ‌న ప్ర‌భుత్వం ఉండేది క‌దా!’: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్.. సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబుకు ఆ ధైర్యం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఇడుపుల‌పాయ‌లో ఆయ‌న స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించిన అనంతరం.. సాయంత్రం స్థానిక ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.ప‌లువురి నుంచి విన‌తి ప‌త్రాలు తీసుకున్నారు. అదేవిధంగా ప‌లువురు చిన్నారుల‌కు.. కొద్దిపాటి ఆర్థిక సాయం అందించారు. అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు విష‌యాల‌పై దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఒంటిమిట్ట‌, పులివెందుల‌లో ఇటీవ‌ల జ‌రిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా ఓడిపోయింద‌న్న విష‌యంపై సుదీర్ఘంగా నాయ‌కుల‌తో చ‌ర్చించారు. పార్టీకి బ‌లం లేక ఓడిపోలేద‌ని.. పోలీసులు ఓట్లువేసేవారిని బూతుల‌కు రాకుండా అడ్డుకున్నార‌ని.. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు చెప్పారు. కిలో మీట‌ర్ల మేర‌కు.. పోలింగ్ బూత్‌ల‌ను మార్చేశార‌ని.. దీంతో చాలా మంది ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ స్పందిస్తూ.. చంద్ర‌బాబుకు ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం లేద‌ని.. ప్ర‌జాస్వామ్యయుతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించే ధైర్యం కూడా ఆయ‌న‌కు లేద‌ని విమ‌ర్శించారు.

అంతేకాదు.. ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే.. వైసీపీ అభ్య‌ర్థులు గెలిచి ఉండేవార‌ని జ‌గ‌న్ చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని కూట‌మి పాల‌కుల‌పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. “గ‌తంలో మ‌న పాల‌న‌లో ఇలా ఎప్పుడూ చేయ‌లేదు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయాల‌ని మ‌న‌కు తెలియ‌దు. అలా చేసి ఉంటే ఇప్పుడు వారు గెలిచేవారా?” అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న భ‌రోసా క‌ల్పించారు. ఇక‌, నుంచి ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి జిల్లాకు వ‌స్తాన‌ని.. రాజ‌కీయంగా బ‌లోపేతం కావాల‌ని సూచించారు.

కూట‌మి నేత‌ల‌పై పదునైన వ్యూహంతో విమ‌ర్శ‌లు పెంచాల‌ని త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు జ‌గ‌న్ సూచించారు. ఎవ‌రూ ఆవేద‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్.. ప్ర‌తి ఒక్కరికీ ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. కాగా.. ఈ స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు మాజీ వలంటీర్లు.. జ‌గ‌న్‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. సిబ్బంది అడ్డ‌గించారు. ఈ విష‌యం తెలిసిన జ‌గ‌న్‌.. వారిని లోప‌లికి అనుమ‌తించాల‌ని ఆదేశించ‌డంతో కొంద‌రిని పంపించారు. ఈ స‌మ‌యంలో వారు త‌మ ఆర్థిక స‌మ‌స్య‌లు చెప్పుకొచ్చారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం.. “మీరంతా స‌క్రంగా ప‌నిచేసి ఉంటే.. మ‌న ప్ర‌భుత్వం ఉండేది క‌దా!” అని వ్యాఖ్యానించారు. అనంత‌రం వారి నుంచి విన‌తులు తీసుకుని సాగ‌నంపారు.

This post was last modified on September 2, 2025 9:46 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

23 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago