ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆశేతు హిమాచలం.. ఆయనకు శుభాకాంక్షలు చెబుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు వరకు.. పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. ఎవరెలా స్పందించినప్పటికీ.. పవన్ కల్యాణ్ ప్రజాసేవలను వారు కొనియాడారు. మొక్కై వచ్చి.. మానై ఎదిగారంటూ.. విషెస్ను కుమ్మరించారు.
ప్రధాని ఏమన్నారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాదిమంది ప్రజల హృదయాల్లో పవన్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా.. ప్రభుత్వ పాలనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజలకు చేరువ అవుతున్నారని తెలిపారు. అదేసమయంలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేయడంలోనూ.. పవన్ అడుగులు బలంగా పడుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు మాటిది..!
ఏపీ సీఎం చంద్రబాబు పవన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్ది అడుగడుగునా సామాన్యుడి పక్షం. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం“ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు.. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. పాలన సహా రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిదని కొనియాడారు.
అన్నకు అభినందనం: లోకేష్
పవన్ కల్యాణ్ను అన్న అని సంభోదించే మంత్రి నారా లోకేష్.. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ `పీపుల్ స్టార్`గా ఎదిగారని పేర్కొన్నారు. నిరంకుశ పాలనను నేలమట్టం చేయడంలో ఎంతో కృషి చేశారని తెలిపారు. “ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు“ అని పేర్కొన్నారు.
This post was last modified on September 2, 2025 7:58 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…