Political News

వైసీపీ… చిత్త శుద్ధి లేని శివ‌పూజ‌లు.. !

వైసిపి అధినేత జగన్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా దీక్షలకు దిగుతున్నారు. విశాఖపట్నం లోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు అందరికీ తెలిసిందే. పైకి ప్రైవేటీకరణ లేదని రాష్ట్రస్థాయిలో బిజెపి నాయకులు ఎవరూ చెప్పడం లేదు. కానీ కూటమిలోని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సీఎం చంద్రబాబు చూచాయిగా చెబుతున్నారు. ఇంతకుమించి మిగిలిన నాయకులు ఎవరూ మాట్లాడటం లేదు.

ఇక కేంద్రం నుంచి దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. మరోవైపు ఉన్నటువంటి విభాగాల్లో కీలకమైన ఫర్నజ్ బ్లాస్ట్ సహాగ‌నులు వంటి వాటిని ప్రైవేటీకరించేందుకు 34 విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈనెల 5వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందని యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్మికులు తమకు అండగా ఉండే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నేనున్నానంటూ వారికి పక్షాన నిలబడి దీక్షలకు సిద్ధమవుతోంది.

అయితే, ఇవి ఏ మేరకు ఫలిస్తాయి.. వైసిపి చేస్తున్నటువంటిది రాజకీయమా లేకపోతే నిజంగానే కార్మికుల పట్ల ఉక్కు కర్మాగారం పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉంది అనేది ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎందుకంటే వైసిపి అధికారంలో ఉండగానే విశాఖపట్నం కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించినద‌రిమిలా.. కేంద్ర మంత్రివర్గం కూడా దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. దీనిపై ఇప్పటివరకు న్యాయపోరాటం కానీ వైసీపీ తరఫున ఎటువంటి బలమైన వాదనలు కానీ వినిపించలేదు. ప్రస్తుతం మాత్రమే రాజకీయంగా చూస్తూ దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా వైసిపి అడుగులు వేస్తున్నది.

నిజంగానే కార్మికుల ప‌క్షాన‌ నిలబడితే కచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుంది. కానీ, గతంలో ఏం చేసింది అన్నది చూస్తే మాత్రం విమర్శలు స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడైనా చిత్తశుద్ధి లేని శివ పూజలాగా పైపైకే దీక్షలు చేసి వదిలిపెడతారా.. నిజంగానే సాధిస్తారా.. అనేది చూడాలి. వాస్తవానికి దీక్షలు అంటే సాధారణంగా రిలే నిరాహార దీక్షలు ఉంటాయి. ఉదయం పూట టిఫిన్ చేసి వచ్చి సాయంత్రం వరకు కూర్చోవడం వెళ్లిపోవడం వరకే కనిపిస్తాయి. మరి వైసీపీ ఇలాంటి దీక్షలను ఎంచుకుంటే మరింత డ్యామేజీ కావడం ఖాయమని విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులే చెబుతుండడం గమనార్హం.

This post was last modified on September 2, 2025 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

31 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

51 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago