Political News

కేసీఆర్ ను కవిత కాపాడారా? ఇరికించారా?

తెలంగాణ జనం ఇప్పుడు ఓ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక మేథావి వర్గం అయితే…ఈ చర్చలపై రకరకాల విశ్లేషణలతో వారివారి వాదనలను వినిపిస్తున్నారు. అదేంటంటే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేతను కాళేశ్వరం కేసులో కాపాడేందుకు యత్నించారా? లేదంటే పూర్తిగా ఇరికించేశారా? అన్నదే ఆ చర్చ. కాళేశ్వరంలో చిల్లిగవ్వ అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ బల్లగుద్ది మరీ చెబుతుంటే… కవిత మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఓ సర్టిఫికెట్ ఇచ్చి పడేశారు.

నేరుగా కవిత ఆ మాట అనకున్నా… కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావులకు పాత్ర ఉందని చెప్పడం ద్వారా ఆమె అవినీతిని ధృవీకరించినట్టైంది. కాళేశ్వరం అవినీతి మరకలను తన తండ్రి కేసీఆర్ కు హరీశ్, సంతోష్ లే అంటించారని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రూలింగ్ ఇచ్చినట్టే కదా. అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న పార్టీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ అదినేత కుమార్తె స్వయంగా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే… అవినీతి జరగలేదని ఎలా వాదించేది? నిజమే మరి… మంగళవారం నుంచి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ చేసే వాదనలను వైరి వర్గాలు అలా ఈజీగా కొట్టిపారేస్తాయి.

హరీశ్, సంతోష్ లు తన తండ్రికి అవినీతి మరకలు అంటించారని కవిత చెబితే… మరి నాడు ప్రభుత్వాధినేతగా, ముఖ్యమంత్రిగా, మంత్రిమండలికి మార్గదర్శకుడిగా కొనసాగిన కేసీఆర్ కు కూడా అవినీతి అంటినట్టే కదా. మరి ఈ వాస్తవాన్ని మరిచిన కవిత…కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, తన తండ్రికి మాత్రం ఏ పాపం తెలియదని చెబితే ఎవరూ నమ్మరు కదా. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అదేనని చెప్పక తప్పదు. అసలు కవిత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా ఏ ఆశించి అంత సంచలన వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఏ ఒక్కరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఈ లెక్కన కవిత ఏ లెక్కలు వేసుకుని మీడియా ముందుకు వచ్చారో తెలియదు కానీ… తన వ్యాఖ్యల ద్వారా తన తండ్రి కేసీఆర్ ను కాపాడటానికి బదులుగా అడ్డంగా ఇకిరించి పరేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఇంకాస్త దూరం ఆలోచిస్తున్న మేథావులు… కవిత కావాలనే ఇదంతా చేస్తున్నారన్న వాదనలనూ వినిపిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి దూరంగా జరగాలని తాను ఎన్నో రోజులుగా చూస్తుంటే… పార్టీ బయటకు పంపడం లేదని, ఈ వ్యాఖ్యలతో అయినా తనను సస్పెండ్ చేస్తే వేరు కుంపటి పెట్టుకోవచ్చన్న భావనతో, తనను సస్సెండ్ చేశారన్న వాదనను సింపతీగా మలచుకోవాలన్న భావనతోనే ఆమె సాగుతున్నట్లుగా మరికొందరు భావిస్తున్నారు.

This post was last modified on September 2, 2025 9:22 am

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

1 minute ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

19 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

23 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago