Political News

ట్రెండ్ మార్చిన చంద్ర‌బాబు.. ఎక్క‌డికెళ్తే అక్క‌డే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు ట్రెండ్ మార్చారా? ఎక్క‌డికి వెళ్తే అక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌తంలో 2014-19 మ‌ధ్య కూడా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగారు. కానీ, భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు లేదా.. పాల‌నా ప‌ర‌మైన ఒత్తిడి నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి ప‌నులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్ర‌జ‌ల‌తో కేవ‌లం ముచ్చ‌ట్ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేవారు. కానీ, ఈ ఏడు ప‌రిస్థితిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.

ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్‌కు సీఎం చంద్ర‌బాబు ఎక్కువ స‌మయం కేటాయిస్తున్నారు. వారితో క‌లిసి, వారి ప‌క్క‌న కూర్చుని.. వారితో ముచ్చ‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌ద్వారా.. సీఎం అల్లా `మ‌న సీఎం` అనుకునే స్థాయిలో ఆయ‌న అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటున్నారు. ప్రతి నెలా 1వ తారీకున పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా పాల్గొంటున్నారు. నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. వారితో ముచ్చ‌టించి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటున్నారు. వారితో క‌లిసి టీ, కాఫీలు తాగుతున్నారు.

ఇది సీఎం చంద్ర‌బాబును పేద‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ చేసింది. ఇక‌, ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించిన త‌ర్వాత‌.. మ‌రింత ఎక్కువ‌గా ఇంట‌రాక్ష‌న్ క‌ల్పిస్తున్నారు. ఏప‌నిమీద ఎక్క‌డికి వెళ్లినా.. ఆర్టీసీ బ‌స్సు ఎక్కి, మ‌హిళ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, పాల‌న‌, పెట్టుబ‌డుల‌పై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో త‌న విజ‌న్‌ను నేరుగా వారికి ప‌క్క‌న కూర్చోబెట్టుకుని వివ‌రిస్తున్నారు.

శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో డబుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప్రారంభించిన త‌ర్వాత‌.. ఆ బ‌స్సులో ఎక్కి.. ప్ర‌యాణికుల‌తో క‌లిసి నాలుగు కిలో మీట‌ర్లు ప్ర‌యాణించారు. విశాఖ‌లో జ‌రుగుతున్న అభివృద్ధి, ఆర్థిక రాజ‌ధాని గా తాను చేయాల‌ని అనుకుంటున్న డెవ‌ల‌ప్‌మెంటుల‌పై వారితో చ‌ర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా స్థానిక ఆర్టీసీ బ‌స్సు ఎక్కి.. ప్రయాణికుల‌తో మ‌మేక‌మ‌య్యారు. మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు ఆర్టీసీ బ‌స్సులో ప్రయాణించి ప్ర‌భుత్వ ప‌నితీరు, అభివృద్ధి, స‌మ‌స్య‌ల‌పై నేరుగా వారిని అడిగి తెలుసుకున్నారు. త‌ద్వారా.. ప్ర‌జా సీఎంగా.. మ‌న సీఎంగా ప్ర‌జ‌ల మ‌న‌సులో ముద్ర వేసుకునేదిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on August 30, 2025 10:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago