Political News

ట్రెండ్ మార్చిన చంద్ర‌బాబు.. ఎక్క‌డికెళ్తే అక్క‌డే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు ట్రెండ్ మార్చారా? ఎక్క‌డికి వెళ్తే అక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌తంలో 2014-19 మ‌ధ్య కూడా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగారు. కానీ, భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు లేదా.. పాల‌నా ప‌ర‌మైన ఒత్తిడి నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి ప‌నులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్ర‌జ‌ల‌తో కేవ‌లం ముచ్చ‌ట్ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేవారు. కానీ, ఈ ఏడు ప‌రిస్థితిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.

ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్‌కు సీఎం చంద్ర‌బాబు ఎక్కువ స‌మయం కేటాయిస్తున్నారు. వారితో క‌లిసి, వారి ప‌క్క‌న కూర్చుని.. వారితో ముచ్చ‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌ద్వారా.. సీఎం అల్లా `మ‌న సీఎం` అనుకునే స్థాయిలో ఆయ‌న అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటున్నారు. ప్రతి నెలా 1వ తారీకున పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా పాల్గొంటున్నారు. నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. వారితో ముచ్చ‌టించి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటున్నారు. వారితో క‌లిసి టీ, కాఫీలు తాగుతున్నారు.

ఇది సీఎం చంద్ర‌బాబును పేద‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ చేసింది. ఇక‌, ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించిన త‌ర్వాత‌.. మ‌రింత ఎక్కువ‌గా ఇంట‌రాక్ష‌న్ క‌ల్పిస్తున్నారు. ఏప‌నిమీద ఎక్క‌డికి వెళ్లినా.. ఆర్టీసీ బ‌స్సు ఎక్కి, మ‌హిళ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, పాల‌న‌, పెట్టుబ‌డుల‌పై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో త‌న విజ‌న్‌ను నేరుగా వారికి ప‌క్క‌న కూర్చోబెట్టుకుని వివ‌రిస్తున్నారు.

శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో డబుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప్రారంభించిన త‌ర్వాత‌.. ఆ బ‌స్సులో ఎక్కి.. ప్ర‌యాణికుల‌తో క‌లిసి నాలుగు కిలో మీట‌ర్లు ప్ర‌యాణించారు. విశాఖ‌లో జ‌రుగుతున్న అభివృద్ధి, ఆర్థిక రాజ‌ధాని గా తాను చేయాల‌ని అనుకుంటున్న డెవ‌ల‌ప్‌మెంటుల‌పై వారితో చ‌ర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా స్థానిక ఆర్టీసీ బ‌స్సు ఎక్కి.. ప్రయాణికుల‌తో మ‌మేక‌మ‌య్యారు. మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు ఆర్టీసీ బ‌స్సులో ప్రయాణించి ప్ర‌భుత్వ ప‌నితీరు, అభివృద్ధి, స‌మ‌స్య‌ల‌పై నేరుగా వారిని అడిగి తెలుసుకున్నారు. త‌ద్వారా.. ప్ర‌జా సీఎంగా.. మ‌న సీఎంగా ప్ర‌జ‌ల మ‌న‌సులో ముద్ర వేసుకునేదిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది.

Kumar

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

4 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago