తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాద్ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాజధాని కావడంతో అధికార యంత్రాంగం హుటా హుటిన స్పందించి.. ప్రజలను ఆదుకుంది. కానీ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. సహాయక సిబ్బంది తక్కువగా ఉండడం.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. మెదక్-కామారెడ్డి జిల్లాలు కకావికలం అయ్యాయి. భారీ వర్షాలతో కామారెడ్డిలో వరదలు ప్రమాదకరంగా మారాయి. జీఆర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ వరదలో మునిగిపోయిందని, అందులో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు. కాగా, నాగిరెడ్డిపేట్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను స్థానికులు, మెదక్ రామాయంపేట మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన 300 మంది స్టూడెంట్స్ను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మెదక్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న విద్యార్థులను ఫైర్ బోట్ల ద్వారా 150 మందిని బయటికి తీసుకొచ్చారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు పోచారం ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చరింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి పడింది. ఏ క్షణమైన కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కట్ట తెగితే భారీగా పంట నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో గండి పూడ్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్లో ట్రాక్పై వరద ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను దారి మళ్లించారు. అక్కన్నపేట-మెదక్ సెక్షన్ పరిధిలో పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…