Political News

15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ ప్ర‌య‌త్నం.. సాకార‌మ‌య్యేనా?

దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భారత్ చేస్తున్న ప్ర‌య‌త్నం.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు పావులు క‌ద‌ప‌డం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంత‌ర్జాతీయ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల సంఘం నిర్వ‌హించే బిడ్డింగ్‌లో పాల్గొనాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వ‌హించే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది.

కాగా.. భార‌త్ బిడ్ వేసేందుకు ఇండియా ఒలింపిక్ సంఘం అంగీక‌రించింది. అయితే.. ఈ క్రీడ‌ల‌కు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్‌తో పాటు నైజీరియా సహా.. ఇత‌ర దేశాలు కూడా ఆస‌క్తిగా ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో భార‌త్ ప్ర‌య‌త్నం ఏమేర‌కు సాకారం అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి కార‌ణం.. 2010లో భార‌త్‌లో నిర్వ‌హించిన కామ‌న్ వెల్త్ క్రీడ‌లు వివాదాల‌కు దారితీశాయి. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సంవ‌త్స‌రం కూడా భార‌త్‌లో నిర్వ‌హించాల‌న్న విష‌యానికి బ్రేకులు ప‌డ్డాయి.

అప్ప‌టి నుంచి కూడా భార‌త క్రీడాకారులు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. 2010లో అప్ప‌టి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌లకు, వివాదాల‌కు కూడా దారి తీసింది. అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో కామ‌న్ వెల్త్ అంత‌ర్జాతీయ సంఘం ఆరోపించ‌డంతోపాటు.. దీనిపై విచార‌ణ కూడా చేయించారు. సుమారు 200 కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్ప‌ట్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్ల‌పాటు భార‌త్‌ను బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు.

ఫ‌లితంగా అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌త్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది. కామ‌న్‌వెల్త్‌ను అప్ప‌టి సీఎం షీలాదీక్షిత్ క్యాష్ చేసుకున్నార‌ని.. బీజేపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆధారాల‌తో స‌హా.. కోర్టుకు కూడా వెళ్లారు. అనుమ‌తుల నుంచి క్రీడాకారుల‌కు ఇచ్చే ఆహారం వ‌ర‌కు అన్నింటిలోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ బిడ్ వేసేందుకు అనుమ‌తి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిలో ఏమేర‌కు దేశం స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 27, 2025 10:39 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

53 minutes ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago