Political News

15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ ప్ర‌య‌త్నం.. సాకార‌మ‌య్యేనా?

దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భారత్ చేస్తున్న ప్ర‌య‌త్నం.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు పావులు క‌ద‌ప‌డం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంత‌ర్జాతీయ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల సంఘం నిర్వ‌హించే బిడ్డింగ్‌లో పాల్గొనాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వ‌హించే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది.

కాగా.. భార‌త్ బిడ్ వేసేందుకు ఇండియా ఒలింపిక్ సంఘం అంగీక‌రించింది. అయితే.. ఈ క్రీడ‌ల‌కు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్‌తో పాటు నైజీరియా సహా.. ఇత‌ర దేశాలు కూడా ఆస‌క్తిగా ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో భార‌త్ ప్ర‌య‌త్నం ఏమేర‌కు సాకారం అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి కార‌ణం.. 2010లో భార‌త్‌లో నిర్వ‌హించిన కామ‌న్ వెల్త్ క్రీడ‌లు వివాదాల‌కు దారితీశాయి. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సంవ‌త్స‌రం కూడా భార‌త్‌లో నిర్వ‌హించాల‌న్న విష‌యానికి బ్రేకులు ప‌డ్డాయి.

అప్ప‌టి నుంచి కూడా భార‌త క్రీడాకారులు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. 2010లో అప్ప‌టి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌లకు, వివాదాల‌కు కూడా దారి తీసింది. అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో కామ‌న్ వెల్త్ అంత‌ర్జాతీయ సంఘం ఆరోపించ‌డంతోపాటు.. దీనిపై విచార‌ణ కూడా చేయించారు. సుమారు 200 కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్ప‌ట్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్ల‌పాటు భార‌త్‌ను బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు.

ఫ‌లితంగా అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌త్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది. కామ‌న్‌వెల్త్‌ను అప్ప‌టి సీఎం షీలాదీక్షిత్ క్యాష్ చేసుకున్నార‌ని.. బీజేపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆధారాల‌తో స‌హా.. కోర్టుకు కూడా వెళ్లారు. అనుమ‌తుల నుంచి క్రీడాకారుల‌కు ఇచ్చే ఆహారం వ‌ర‌కు అన్నింటిలోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ బిడ్ వేసేందుకు అనుమ‌తి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిలో ఏమేర‌కు దేశం స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 27, 2025 10:39 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

40 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago