Political News

15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ ప్ర‌య‌త్నం.. సాకార‌మ‌య్యేనా?

దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భారత్ చేస్తున్న ప్ర‌య‌త్నం.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు పావులు క‌ద‌ప‌డం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంత‌ర్జాతీయ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల సంఘం నిర్వ‌హించే బిడ్డింగ్‌లో పాల్గొనాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వ‌హించే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది.

కాగా.. భార‌త్ బిడ్ వేసేందుకు ఇండియా ఒలింపిక్ సంఘం అంగీక‌రించింది. అయితే.. ఈ క్రీడ‌ల‌కు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్‌తో పాటు నైజీరియా సహా.. ఇత‌ర దేశాలు కూడా ఆస‌క్తిగా ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో భార‌త్ ప్ర‌య‌త్నం ఏమేర‌కు సాకారం అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి కార‌ణం.. 2010లో భార‌త్‌లో నిర్వ‌హించిన కామ‌న్ వెల్త్ క్రీడ‌లు వివాదాల‌కు దారితీశాయి. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సంవ‌త్స‌రం కూడా భార‌త్‌లో నిర్వ‌హించాల‌న్న విష‌యానికి బ్రేకులు ప‌డ్డాయి.

అప్ప‌టి నుంచి కూడా భార‌త క్రీడాకారులు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. 2010లో అప్ప‌టి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌లకు, వివాదాల‌కు కూడా దారి తీసింది. అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో కామ‌న్ వెల్త్ అంత‌ర్జాతీయ సంఘం ఆరోపించ‌డంతోపాటు.. దీనిపై విచార‌ణ కూడా చేయించారు. సుమారు 200 కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్ప‌ట్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్ల‌పాటు భార‌త్‌ను బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు.

ఫ‌లితంగా అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌త్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది. కామ‌న్‌వెల్త్‌ను అప్ప‌టి సీఎం షీలాదీక్షిత్ క్యాష్ చేసుకున్నార‌ని.. బీజేపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆధారాల‌తో స‌హా.. కోర్టుకు కూడా వెళ్లారు. అనుమ‌తుల నుంచి క్రీడాకారుల‌కు ఇచ్చే ఆహారం వ‌ర‌కు అన్నింటిలోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ప‌రిణామాల అనంత‌రం.. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ బిడ్ వేసేందుకు అనుమ‌తి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిలో ఏమేర‌కు దేశం స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 27, 2025 10:39 pm

Share

Recent Posts

నెగిటివిటీని తట్టుకుంటేనే సత్తా తెలుస్తుంది

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…

15 minutes ago

మొదటిసారి పెట్రోల్ కార్లను దాటేసిన CNG, EVలు

భారత్‌లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…

15 minutes ago

యష్ చేసిన పొరపాట్లే తప్పులుగా మారాయా

థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…

2 hours ago

వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి…

2 hours ago

ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మ‌ధ్యంతర ఎన్నిక‌ల సెగ భారీగా త‌గిలేలా క‌నిపిస్తోంది. మ‌ధ్యంతర ఎన్నిక‌లు వ‌చ్చే అక్టోబ‌రు-న‌వంబ‌రు మాసాల…

3 hours ago

బుచ్చిబాబు ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయంటే

పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…

5 hours ago