టీడీపీ అధినేత చంద్రబాబు.. యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పార్టీలో కీలక పదవులను యువతకు అప్పగించడం ద్వారా.. వచ్చే ఎన్నికలకు యుద్ధాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. పార్టీలోని 40 శాతం మంది యువతకు అవకాశాలు ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా యువతను ప్రోత్సహించడం ద్వారా.. పార్టీలో యువ నాయకత్వాన్ని పెంచాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో మూడు ప్రధాన అంశాలను లెక్కలోకి తీసుకుంటున్నారు.
1) వివాద రహితులు: పార్టీలో చేర్చుకునే నాయకులు, లేదా ఉన్న నాయకులు.. 30-45 ఏళ్లలోపు వారై ఉండి.. వివాదాలకు దూరంగా ఉన్నవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు తాజాగా ఆదేశించారు. అంతేకాదు.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించేవారు కావాలని కోరుకుంటున్నారు. ఇక, పార్టీ పరంగా అంకిత భావంతో పనిచేసేవారి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఉన్నత స్థాయి విద్యావంతులు అయితే.. మరింత హుందాగా రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్న భావనతోనూ ఉన్నారు.
2) చురుకైనయువతరం: పార్టీలో ప్రస్తుతం ఉన్న యువ నాయకుల్లో చురుకున్న వారి కంటే కూడా దూకుడు ఎక్కువగా ఉన్న వారు కనిపిస్తున్నారు. వీరివల్ల వివాదాలకు కేంద్రంగా పంచాయతీలకు అవకాశం ఇచ్చేలా పార్టీ మారిపోయింది. పలు జిల్లాల నుంచి రోజూ.. ఏదో ఒక సమస్య తెరమీదికి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో యువతలో చురుకుతనం ఉండి.. వివాదాలకు కడు దూరంగా ఉండే నాయకులు అయితే బెస్ట్ అని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
3) సామాజిక వర్గం: సాధారణంగా పార్టీలలో పదవులు అంటే.. సామాజిక వర్గాల వారీగానే కేటాయింపులు.. భర్తీలు జరుగుతాయి. ఇప్పుడు టీడీపీలోనూ అదే సోషల్ ఇంజనీరింగ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. పూర్తిగా గుండుగుత్తగా ఒకే వర్గానికి కాకుండా.. టాలెంట్ బేస్డ్ యూత్ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే టాలెంట్కు పెద్ద పీట వేయాలని భావిస్తున్నారు. మొత్తంగా త్రిముఖ వ్యూహంతో టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించడం గమనార్హం.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…