Political News

సీఎం పై దాడి వెనుక ప్లాన్ బయటపడింది

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడైన రాజేష్‌ సక్రియా కత్తిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎందుకు వదిలేశాడు అనే వివరాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, రాజేష్‌ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర కూరగాయల బండి నుంచి కత్తి తీసుకున్నాడు. మొదట అతని లక్ష్యం సుప్రీంకోర్టు. అక్కడ కుక్కలపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాడి చేయాలని అనుకున్నాడు. కానీ కోర్టులో ఉన్న కఠినమైన భద్రతను చూసి తన ప్లాన్‌ను వదిలేశాడు. ఆ తర్వాత రేఖా గుప్తా నివాసం శాలిమార్ బాగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ కూడా దాడి చేయాలని చూసినా, చివరికి ఆమె సివిల్ లైన్స్ కార్యాలయంలో ‘జనసున్వాయి’ కార్యక్రమం జరుగుతుండగా కత్తిని వదిలేసి, ఆమెను చెంపదెబ్బ కొట్టి, జుట్టు లాగినట్లు పోలీసులు తెలిపారు.

రాజేష్ సక్రియా కుక్కల పట్ల ఆసక్తి కలవాడు. వీధికుక్కలను తొలగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా రేఖా గుప్తా తన పిలుపును పట్టించుకోలేదని ఆవేశంతో దాడి చేశాడని సమాచారం. ఈ కుట్రలో అతనికి సహకరించిన తహ్సీన్ సయ్యద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ నిరంతరం సంప్రదింపులు కొనసాగించారని, రేఖా గుప్తా నివాస వీడియోను రాజేష్ తన మిత్రుడికి పంపినట్లు దర్యాప్తులో బయటపడింది.

పోలీసులు ఈ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేశారు. ఆ సమయంలో సయ్యద్, “ఎవరు అడ్డం వచ్చినా వదిలేది లేదు” అని చెప్పినట్లు వెల్లడైంది. ఈ కేసులో ఉపయోగించిన కత్తి మాత్రం ఇంకా దొరకలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆ కత్తి కోసం శోధిస్తున్నారు.

రేఖా గుప్తాపై ఈ దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ముఖ్యమంత్రి భద్రతను కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నారు. నిందితులిద్దరూ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

This post was last modified on August 25, 2025 5:20 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Rekha Guptha

Recent Posts

రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…

1 hour ago

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

6 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

6 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

7 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

8 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

9 hours ago