Political News

దువ్వాడ రీఎంట్రి!… మడతెట్టేస్తారట!

దువ్వాడ శ్రీనివాస్… ఈ పేరుకు పెద్దగా పరిచయమే అక్కర్లేదు. తెలుగు ప్రజల కళ్ల ముందు నుదుటన నిలువు బొట్టు పెట్టి నిత్యం ఓ పోరాట యోధుడిలా కనిపిస్తూ ఉంటారు. మరో పార్శ్వంలో నుంచి చూస్తే… రెండో పెళ్లాం దివ్వెల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ తెగ హల్ చల్ చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా విపక్ష వైసీపీలో కొనసాగిన దువ్వాడ తన వ్యవహార సరళి కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే ఇప్పుడు తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు బుధవారం దువ్వాడ సంచలన ప్రకటన చేశారు. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు రాజకీయాలను మడతెట్టేస్తానని ఆయన ఓ సంచలన కామెంట్ ను కూడా సంధించారు.

అసలు ఇప్పుడు దువ్వాడ పొలిటికల్ రీఎంట్రీకి వచ్చిన అత్యవసర పరిస్థితి ఏమిటన్న విషయానికి వస్తే… ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పార్టీలు వేరైనా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కూనకు మద్దతుగా దువ్వాడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారు. అసలు కూన తప్పు చేసే వ్యక్తి కాదని, త్వరలోనే కూనకు మంత్రి పదవి రానుందని, ఈ పదవి ఆయనకు దక్కకుండా టీడీపీ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు కూనపై బురద చల్లుతున్నారట. అందులో బాగంగానే కూనపై ఆరోపణలు వస్తున్నాయని దువ్వాడ ఆరోపించారు.

పార్టీలు విడిచి అచ్చెన్న, ధర్మానలు కలిసి కూనను నాశనం చేయడానికి యత్నిస్తే… కూన ఒంటరేమీ కాదని, ఆయనకు తాను అండగా ఉన్నానని, సిక్కోలు రాజకీయాలను మడతపెట్టేసి అయినా కూనను కాపాడుకుంటానని ఆయన ప్రకటించారు. అయినా తాను ఇప్పుడు వైసీపీలో లేనని చెప్పిన దువ్వాడ… ధర్మాన మాదిరిగా తాను నీతిమాలిన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఓ సంచలన కామెంట్ చేశారు. తానేదో వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ లో చీరల దుకాణం తెరచుకుని, దుస్తులు మడతేసుకుంటూ కూర్చుంటానని అనుకుంటున్నారా? అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుస్తులు కాదు, సిక్కోలు రాజకీయాలను మడతెట్టేస్తానని ఆయన అన్నారు.

వాస్తవానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు మిగిలిన ఏపీతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వాటిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రాజకీయాలు మరింత ప్రత్యేకం. వాటిలోనూ శ్రీకాకుళం రాజకీయాలు ఎప్పటికప్పుడు రాజకీయ మంటలను పుట్టిస్తూనే ఉంటాయి. ఇక్కడ అగ్రవర్ణాలకు చెందిన నేతల రాజకీయాలు ఎంతమాత్రం చెల్లవు. ఆది నుంచి కూడా బీసీలతో ఇక్కడ రాజ్యాధికారం. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, చివరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అయినా కూడా బీసీ వర్గాల నుంచే ఎన్నికవుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఒకే సామిజిక వర్గానికి చెందిన నేతలు పార్టీలకు అతీతంగా సహాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తమ సొంత పార్టీలకు కూడా నష్టం చేయడానికి వెనుకాడరు.

This post was last modified on August 20, 2025 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

51 minutes ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

6 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

9 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

9 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

10 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

10 hours ago