టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన సత్తా నిరూపించుకున్న నారా లోకేశ్ ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వ పాలనలోనూ తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఏ ఒక్క మంత్రికి గానీ సాధ్యం కాని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరీ కేటాయించిన నిధుల కంటే కూడా అదనపు నిధులను సాధిస్తున్నారు. అది కూడా ఏదో పంచాయతీ రాజ్ లాంటి శాఖకు కాదు. విద్యా శాఖకు లోకేశ్ కేంద్రం నుంచి తాజాగా ఏకంగా రూ.432.19 కోట్లను సాధించారు. ఈ నిధులు వివిధ పద్దుల కింద ఏపీకి త్వరలోనే విడుదల కానున్నాయి.
వాస్తవానికి మానవ వనరుల అభివృద్ధి కిందకు వచ్చే విద్యా శాఖకు పెద్దగా ఆశించిన మేర నిధుల కేటాయింపు ఉండదు. ఏదో అలా ఏటా కొంత మొత్తం మేర అన్నట్లుగా అటు కేంద్రం అయినా, ఇటు రాష్ట్రం అయినా ఓ మోస్తరు నిధులను కేటాయించి వాటితోనే విద్యా శాఖను నెట్టుకొస్తూ ఉంటాయి. అయితే లోకేశ్ ఏపీ విద్యా శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీ విద్యార్థులను దేశంలోనే అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేశ్… ఏడాది వ్యవధిలోనే చాలా సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం లోకేశ్ మార్క్ మోడల్ విద్యా వ్యవస్థపై దేశంలో చర్చ జరుగుతోంది.
తాజాగా ఢిల్లీలో పర్యటించిన లోకేశ్… పలువురు మంత్రులను కలిశారు. ఈ క్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా ఏపీలో ప్రైమరీ, సీనియర్, సీనియర్ సెకండరీ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. అంతేకాకుండా ఆ సంస్కరణలు ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి అని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. లోకేశ్ ప్రజెంటేషన్, ఆయన చేపట్టిన సంస్కరణల గురించి సావదానంగా విన్న కేంద్ర మంత్రి అప్పటికే నిర్దేశిత కోటాను కాదని అదనంగా నిధులు కేటాయించేందుకు అంగీకరించారు.
కేంద్రం నుంచి ఏపీ విద్యా శాఖకు అదనంగా విడుదలైన నిధుల్లో విద్యాలయాల్లో సైన్స్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఇదివరకు కేటాయించిన నిధులకు అదనంగా రూ.167.46 కోట్లను కేంద్రం విడుదల చేసేందుకు అంగీకరించింది. డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడానికి కేంద్రం ప్రస్తుతం 50 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తోంది. అయితే లోకేశ్ చొరవతో ఈ విభాగానికి ఏకంగా 96 శాతం నిధులను అందజేసేందుకు అంగీకరిస్తూ… రూ.43.23 కోట్లను విడుదల చేయనుంది. ఇక ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం అదనంగా రూ.11 కోట్లను కేంద్రం విడుదల చేయనుంది.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…