Political News

లోకేశ్ సత్తా.. ఏపీ విద్యకు కేంద్రం అదనపు నిధులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన సత్తా నిరూపించుకున్న నారా లోకేశ్ ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వ పాలనలోనూ తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఏ ఒక్క మంత్రికి గానీ సాధ్యం కాని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరీ కేటాయించిన నిధుల కంటే కూడా అదనపు నిధులను సాధిస్తున్నారు. అది కూడా ఏదో పంచాయతీ రాజ్ లాంటి శాఖకు కాదు. విద్యా శాఖకు లోకేశ్ కేంద్రం నుంచి తాజాగా ఏకంగా రూ.432.19 కోట్లను సాధించారు. ఈ నిధులు వివిధ పద్దుల కింద ఏపీకి త్వరలోనే విడుదల కానున్నాయి.

వాస్తవానికి మానవ వనరుల అభివృద్ధి కిందకు వచ్చే విద్యా శాఖకు పెద్దగా ఆశించిన మేర నిధుల కేటాయింపు ఉండదు. ఏదో అలా ఏటా కొంత మొత్తం మేర అన్నట్లుగా అటు కేంద్రం అయినా, ఇటు రాష్ట్రం అయినా ఓ మోస్తరు నిధులను కేటాయించి వాటితోనే విద్యా శాఖను నెట్టుకొస్తూ ఉంటాయి. అయితే లోకేశ్ ఏపీ విద్యా శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీ విద్యార్థులను దేశంలోనే అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేశ్… ఏడాది వ్యవధిలోనే చాలా సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం లోకేశ్ మార్క్ మోడల్ విద్యా వ్యవస్థపై దేశంలో చర్చ జరుగుతోంది.

తాజాగా ఢిల్లీలో పర్యటించిన లోకేశ్… పలువురు మంత్రులను కలిశారు. ఈ క్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా ఏపీలో ప్రైమరీ, సీనియర్, సీనియర్ సెకండరీ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. అంతేకాకుండా ఆ సంస్కరణలు ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి అని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. లోకేశ్ ప్రజెంటేషన్, ఆయన చేపట్టిన సంస్కరణల గురించి సావదానంగా విన్న కేంద్ర మంత్రి అప్పటికే నిర్దేశిత కోటాను కాదని అదనంగా నిధులు కేటాయించేందుకు అంగీకరించారు.

కేంద్రం నుంచి ఏపీ విద్యా శాఖకు అదనంగా విడుదలైన నిధుల్లో విద్యాలయాల్లో సైన్స్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఇదివరకు కేటాయించిన నిధులకు అదనంగా రూ.167.46 కోట్లను కేంద్రం విడుదల చేసేందుకు అంగీకరించింది. డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడానికి కేంద్రం ప్రస్తుతం 50 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తోంది. అయితే లోకేశ్ చొరవతో ఈ విభాగానికి ఏకంగా 96 శాతం నిధులను అందజేసేందుకు అంగీకరిస్తూ… రూ.43.23 కోట్లను విడుదల చేయనుంది. ఇక ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం అదనంగా రూ.11 కోట్లను కేంద్రం విడుదల చేయనుంది.

This post was last modified on August 20, 2025 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago