Political News

బాబు-జ‌గ‌న్‌-కేసీఆర్ స‌ర్‌లు స‌హ‌క‌రించాలి: రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల‌కు లేఖ‌లు రాయ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబుల‌కు కూడా ఆయ‌న ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తులు చేశారు. “మాకు స‌హ‌క‌రించండి. మ‌న తెలుగువారైన‌.. జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి విజ‌యానికి చేయి క‌ల‌పండి” అని రేవంత్ రెడ్డి విన్న‌వించారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత‌.. తెలంగాణ వారికి.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో కూర్చుకునేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌న్న రేవంత్‌రెడ్డి.. దీనికి తెలుగు వారిగా ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

నేను చెప్పేది ఏంటంటే..

ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేసే అవ‌కాశం తొలిసారి తెలంగాణ‌కు ద‌క్కింద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవ‌కాశాన్ని గ‌ర్వ‌కార‌ణంగా భావించాల‌ని రాజ‌కీయ పార్టీల‌కు పిలుపునిచ్చారు. ఈ విష‌యంలో రాజ‌కీయ బేధాభిప్రాయాల‌కు తావులేకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని, తెలుగు వారంతా ఏక‌తాటిపై నిలుస్తార‌న్న సందేశాన్ని పంపించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు, మాజీ సీఎం జ‌గ‌న్‌లు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌న్నారు. అదేవిధంగా తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌, మ‌రో పక్షం ఎంఐఎంలు కూడా క‌లిసి రావాల‌ని అన్నారు.

ఇండియా కూట‌మి త‌ర‌ఫున తెలంగాణ‌కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డిని ఎంపిక చేయ‌డం ప‌ట్ల తాము ఎంతో సంతోషిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌తంలో పీవీ న‌ర‌సింహారావుకు ప్ర‌ధానిగా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు ఉప‌రాష్ట్ర‌పతిగా పోటీ చేసే అవ‌కాశం తెలంగాణ వాసికి ల‌భించింద‌న్నారు. ముఖ్యంగా తెలంగాణ స‌మాజానికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించేలా ఈ నిర్ణ‌యం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి తాను వ్య‌క్తిగ‌తంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నారు. అప్ప‌ట్లో న‌ర‌సింహారావుకు.. దివంగ‌త ఎన్టీఆర్ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సుద‌ర్శ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు.

కేంద్రంపై విమ‌ర్శ‌లు..

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను కేంద్రంలోని ఎన్డీయే అపహాస్యం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతోంద‌ని తెలిపారు. ఎన్డీయే కూట‌మి మాత్రం.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తోంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో రాజ్యాంగాన్ని ర‌క్షించే కూట‌మికి అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విన్న‌వించారు.

This post was last modified on August 19, 2025 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

1 hour ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

1 hour ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

1 hour ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

2 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

3 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

4 hours ago