Political News

ఎన్డీయేకు తెర‌చాటు కాదు.. జ‌గ‌న్ బ‌హిరంగ మ‌ద్ద‌తు.. !

వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు కూటమిలో కలవరాన్ని రేపుతోంది. ఇప్పటివరకు జగన్ తటస్థంగా ఉన్నారని భావిస్తూ వచ్చినప్పటికీ తాజా పరిణామాలతో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు అన్నది స్పష్టమైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు. దీంతో జగన్ ఆయనకు ఓకే అని చెప్పినట్టు తాడేపల్లి వరకు చెబుతున్నాయి.

వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో జగన్ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏపీలో ఉన్న టిడిపి బలమైన మద్దతుగా ఉంది. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలు రాజకీయ వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్రం నేరుగా జగన్ను సంప్రదించటం, తమకు మద్దతు ఇవ్వాలని కోరడం, ఈ విషయంపై చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా లేకపోవడం వంటివి రాజకీయంగా టిడిపిలో చర్చనీయాంశంగా మారాయి.

నిజానికి టిడిపి కనుక మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏంటన్నది సీనియర్ నాయకులు సంధిస్తున్న ప్రశ్న. మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వైసిపి ఇష్టమే అయినప్పటికీ ఎన్డీఏ ప్రధాన పక్షంగా ఉన్న టిడిపిని కనీసం సంప్రదించకపోవడం, చంద్రబాబుకు సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేది సరికాదన్నది టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ఇట్లాంటి విషయంలో కనీసం సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది అన్నది వారు చెబుతున్న మాట. ముఖ్యంగా జగన్‌కి ఇప్పుడు పెద్ద బలం ఏమీ లేదని, అయినప్పటికీ ఎన్డీఏ నాయకులు ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నారనేది సందేహంగా మారింది. రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం విషయంలో కూడా జగన్ అరెస్టు అంశం సందిగ్ధంలో పడటానికి కేంద్రంలోని పెద్దలే తెరవెనక ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. లేకపోతే జగన్ సహా మరో ఇద్దరు కీలక నాయకులు ఎప్పుడో అరెస్టయి ఉండేవారని కూడా అంటున్నారు.

ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే అనూహ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేంద్రం జగన్‌ను కోరడం, ఆయన మద్దతు ఇవ్వడం దీనికి సంబంధించిన సమాచారం చంద్రబాబుకు ఏమాత్రం తెలియకపోవడం అంటివి టిడిపిలో చర్చకు దారితీసాయి. మరి దీనిని చంద్రబాబు లైట్ తీసుకుంటారా లేకపోతే కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తారా అనేది చూడాలి. కానీ ఇలాంటి పరిణామాలు మంచిది కాదని, ప్రజలకు సరైన సంకేతాలు అందువని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on August 19, 2025 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

2 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

3 hours ago