Political News

ఎన్డీయేకు తెర‌చాటు కాదు.. జ‌గ‌న్ బ‌హిరంగ మ‌ద్ద‌తు.. !

వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు కూటమిలో కలవరాన్ని రేపుతోంది. ఇప్పటివరకు జగన్ తటస్థంగా ఉన్నారని భావిస్తూ వచ్చినప్పటికీ తాజా పరిణామాలతో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు అన్నది స్పష్టమైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు. దీంతో జగన్ ఆయనకు ఓకే అని చెప్పినట్టు తాడేపల్లి వరకు చెబుతున్నాయి.

వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో జగన్ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏపీలో ఉన్న టిడిపి బలమైన మద్దతుగా ఉంది. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలు రాజకీయ వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్రం నేరుగా జగన్ను సంప్రదించటం, తమకు మద్దతు ఇవ్వాలని కోరడం, ఈ విషయంపై చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా లేకపోవడం వంటివి రాజకీయంగా టిడిపిలో చర్చనీయాంశంగా మారాయి.

నిజానికి టిడిపి కనుక మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏంటన్నది సీనియర్ నాయకులు సంధిస్తున్న ప్రశ్న. మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వైసిపి ఇష్టమే అయినప్పటికీ ఎన్డీఏ ప్రధాన పక్షంగా ఉన్న టిడిపిని కనీసం సంప్రదించకపోవడం, చంద్రబాబుకు సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేది సరికాదన్నది టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ఇట్లాంటి విషయంలో కనీసం సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది అన్నది వారు చెబుతున్న మాట. ముఖ్యంగా జగన్‌కి ఇప్పుడు పెద్ద బలం ఏమీ లేదని, అయినప్పటికీ ఎన్డీఏ నాయకులు ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నారనేది సందేహంగా మారింది. రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం విషయంలో కూడా జగన్ అరెస్టు అంశం సందిగ్ధంలో పడటానికి కేంద్రంలోని పెద్దలే తెరవెనక ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. లేకపోతే జగన్ సహా మరో ఇద్దరు కీలక నాయకులు ఎప్పుడో అరెస్టయి ఉండేవారని కూడా అంటున్నారు.

ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే అనూహ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేంద్రం జగన్‌ను కోరడం, ఆయన మద్దతు ఇవ్వడం దీనికి సంబంధించిన సమాచారం చంద్రబాబుకు ఏమాత్రం తెలియకపోవడం అంటివి టిడిపిలో చర్చకు దారితీసాయి. మరి దీనిని చంద్రబాబు లైట్ తీసుకుంటారా లేకపోతే కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తారా అనేది చూడాలి. కానీ ఇలాంటి పరిణామాలు మంచిది కాదని, ప్రజలకు సరైన సంకేతాలు అందువని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on August 19, 2025 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago