రాజకీయ వివాదాలు ముసురుకుంటున్న సమయంలో కూటమిలో అసలు సమస్య ఎక్కడ ఉంది? నాయకుల వ్యవహారాలు బయటకు లీకెలా అవుతున్నాయి.? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి తప్పులు చేసే నాయకులను ఎవరూ వెనుకేసుకురాకూడదు. తప్పును తప్పుగా చెప్పడం కూడా మంచిదే. నాయకులు మారేలా ప్రోత్సహించాల్సిన అవసరం, మార్పు కోరుకోవడం కూడా మంచిదే. అయితే.. ఇవన్నీ.. అంతర్గతంగా జరగాల్సిన వ్యవహారాలు. కానీ, బయటకు వచ్చేస్తున్నాయి. వీధుల్లో విప్లవాలు సృష్టిస్తున్నాయి.
ఒక్క టీడీపీ అనేకాదు.. జనసేనలోనూ ఇలానే జరుగుతోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతోంది? అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ప్రధానంగా .. నాయకులపై ఆధిపత్య పోరు కారణంగానే ఇది జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నాయకుడి(టీఎన్ఎస్ఎఫ్)తో సంభాషించిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చేసింది. అయితే.. ఇది ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఇస్తే.. ఎమ్మెల్యే ఫోన్ నుంచి బయటకు రావాలి. లేకపోతే.. సదరు టీఎన్ఎస్ఎఫ్ నేత నుంచి రావాలి.
ఈ రెండు కాకుండా.. వేరే వారి ప్రమేయం లేదు. తప్పయినా.. ఒప్పయినా.. ఈ విషయాన్ని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అత్యుత్సాహంతోపాటు.. ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని తట్టుకోలే క జరిగిన పరిణామంగా సీనియర్లు చెబుతున్నారు. ఇక, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వ్యవహారంలోనూ.. హానీ ట్రాప్ జరిగిందన్న చర్చ ఉంది. ఆయన నమ్మి వేరే వ్యక్తితో సంభాషిస్తే.. అది కాస్తా బయటకు వచ్చింది. అంటే.. చిన్న వీక్ నెస్ పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. ఇది కూటమిలో కూడా చర్చనీయాంశం అయింది.
ఇక, కూన రవి కుమార్.. వ్యవహారం దీనికి భిన్నంగా ఉంది. ఆయన ఓ టీచర్ను ఫోన్లోనే హెచ్చరించారు. వాస్తవానికి ఏదైనా తేడా ఉంటే.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, ఆయన ఫోన్ లో సంభాషించడం.. ఉద్యోగ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఆడియో బయటకు వచ్చింది. అంటే.. ఈ ఘటనలు..వివాదాల వెనుక.. ప్రత్యర్థుల కంటే కూడా.. స్వయంగా నాయకులు చేసుకున్న తప్పులే కనిపిస్తున్నాయి. వీటిపై పార్టీ దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసే ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2025 9:58 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…