రాజకీయ వివాదాలు ముసురుకుంటున్న సమయంలో కూటమిలో అసలు సమస్య ఎక్కడ ఉంది? నాయకుల వ్యవహారాలు బయటకు లీకెలా అవుతున్నాయి.? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి తప్పులు చేసే నాయకులను ఎవరూ వెనుకేసుకురాకూడదు. తప్పును తప్పుగా చెప్పడం కూడా మంచిదే. నాయకులు మారేలా ప్రోత్సహించాల్సిన అవసరం, మార్పు కోరుకోవడం కూడా మంచిదే. అయితే.. ఇవన్నీ.. అంతర్గతంగా జరగాల్సిన వ్యవహారాలు. కానీ, బయటకు వచ్చేస్తున్నాయి. వీధుల్లో విప్లవాలు సృష్టిస్తున్నాయి.
ఒక్క టీడీపీ అనేకాదు.. జనసేనలోనూ ఇలానే జరుగుతోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతోంది? అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ప్రధానంగా .. నాయకులపై ఆధిపత్య పోరు కారణంగానే ఇది జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నాయకుడి(టీఎన్ఎస్ఎఫ్)తో సంభాషించిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చేసింది. అయితే.. ఇది ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఇస్తే.. ఎమ్మెల్యే ఫోన్ నుంచి బయటకు రావాలి. లేకపోతే.. సదరు టీఎన్ఎస్ఎఫ్ నేత నుంచి రావాలి.
ఈ రెండు కాకుండా.. వేరే వారి ప్రమేయం లేదు. తప్పయినా.. ఒప్పయినా.. ఈ విషయాన్ని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అత్యుత్సాహంతోపాటు.. ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని తట్టుకోలే క జరిగిన పరిణామంగా సీనియర్లు చెబుతున్నారు. ఇక, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వ్యవహారంలోనూ.. హానీ ట్రాప్ జరిగిందన్న చర్చ ఉంది. ఆయన నమ్మి వేరే వ్యక్తితో సంభాషిస్తే.. అది కాస్తా బయటకు వచ్చింది. అంటే.. చిన్న వీక్ నెస్ పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. ఇది కూటమిలో కూడా చర్చనీయాంశం అయింది.
ఇక, కూన రవి కుమార్.. వ్యవహారం దీనికి భిన్నంగా ఉంది. ఆయన ఓ టీచర్ను ఫోన్లోనే హెచ్చరించారు. వాస్తవానికి ఏదైనా తేడా ఉంటే.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, ఆయన ఫోన్ లో సంభాషించడం.. ఉద్యోగ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఆడియో బయటకు వచ్చింది. అంటే.. ఈ ఘటనలు..వివాదాల వెనుక.. ప్రత్యర్థుల కంటే కూడా.. స్వయంగా నాయకులు చేసుకున్న తప్పులే కనిపిస్తున్నాయి. వీటిపై పార్టీ దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసే ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2025 9:58 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…