వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి దాదాపుగా 3 నెలల తర్వాత ఒకింత ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాకాణిపై ఆ తర్వాత వరుసబెట్టిన మరో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో ఆయన నెల్లూరు జైలులో 85 రోజుల పాటు విచారణ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటిదాకా 7 కేసుల్లో బెయిల్ రాగా… తాజాగా సోమవారం ఏపీ హైకోర్టు రుస్తుం మైనింగ్ కేసులోనూ కాకాణికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా… చేతిలోని మంత్రిదండాన్ని ఝుళిపించిన కాకాణి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో ప్రధానమైనది రుస్తుం మైనింగ్ నుంచి భారీ ఎత్తున అక్రమ మైనింగ్ ను కొనసాగించడం. దీనిపై ఇదివరకే కేసు నమోదు కాగా… కాకాణి అనుచరులు అరెస్టయ్యాయి. అయితే నాడు మంత్రిగా ఉన్న కాకాణి ఈ కేసు తన మీదకు రాకుండా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసును మరింత లోతుగా పరిశీలించి ప్రధాన నిందితుడు కాకాణినే అని తేల్చి ఆయన పేరును కేసులో చేర్చింది.
ఈ క్రమంలో విచారణకు రమ్మంటూ కాకాణిని పోలీసులు పిలవగా… వారి నోటీసులు తీసుకోకుండా కాకాణి పోలీసు శాఖను ఓ రేంజిలో ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే లెక్కలేనన్ని నోటీసులకు ఉద్దేశపూర్వకంగానే కాకాణి తప్పించుకుంటున్నారన్న భావనకు వచ్చిన పోలీసులు కాకాణి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకాణి కేరళ వెళ్లిపోయారు. అయితే పోలీసులు ఆయన ఆచూకీని గుర్తించి కేరళకే వెళ్లి మరీ ఆయనను అరెస్టు చేశారు. అప్పటినుంచి కాకాణి నెల్లూరు జైలులోనే కాలక్షేపం చేయక తప్పలేదు.
This post was last modified on August 18, 2025 9:26 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…