వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి దాదాపుగా 3 నెలల తర్వాత ఒకింత ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాకాణిపై ఆ తర్వాత వరుసబెట్టిన మరో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో ఆయన నెల్లూరు జైలులో 85 రోజుల పాటు విచారణ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటిదాకా 7 కేసుల్లో బెయిల్ రాగా… తాజాగా సోమవారం ఏపీ హైకోర్టు రుస్తుం మైనింగ్ కేసులోనూ కాకాణికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా… చేతిలోని మంత్రిదండాన్ని ఝుళిపించిన కాకాణి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో ప్రధానమైనది రుస్తుం మైనింగ్ నుంచి భారీ ఎత్తున అక్రమ మైనింగ్ ను కొనసాగించడం. దీనిపై ఇదివరకే కేసు నమోదు కాగా… కాకాణి అనుచరులు అరెస్టయ్యాయి. అయితే నాడు మంత్రిగా ఉన్న కాకాణి ఈ కేసు తన మీదకు రాకుండా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసును మరింత లోతుగా పరిశీలించి ప్రధాన నిందితుడు కాకాణినే అని తేల్చి ఆయన పేరును కేసులో చేర్చింది.
ఈ క్రమంలో విచారణకు రమ్మంటూ కాకాణిని పోలీసులు పిలవగా… వారి నోటీసులు తీసుకోకుండా కాకాణి పోలీసు శాఖను ఓ రేంజిలో ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే లెక్కలేనన్ని నోటీసులకు ఉద్దేశపూర్వకంగానే కాకాణి తప్పించుకుంటున్నారన్న భావనకు వచ్చిన పోలీసులు కాకాణి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకాణి కేరళ వెళ్లిపోయారు. అయితే పోలీసులు ఆయన ఆచూకీని గుర్తించి కేరళకే వెళ్లి మరీ ఆయనను అరెస్టు చేశారు. అప్పటినుంచి కాకాణి నెల్లూరు జైలులోనే కాలక్షేపం చేయక తప్పలేదు.
This post was last modified on August 18, 2025 9:26 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…