Political News

అమ‌రావ‌తి మ‌రింత దూకుడు.. ప్ర‌తి ప‌నికీ ప‌క్కా లెక్క‌..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు మ‌రింత దూకుడుగా ముందుకు సాగ‌నున్నాయా? వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను సైతం త‌ట్టుకునే టెక్నాల‌జీతో ప‌నులు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. నిజానికి చిన్న‌పాటి వ‌ర్షానికే ప‌నులు ఆగిపోయే ప‌రిస్థితి ఉంది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. పైగా.. అమ‌రావతి విష‌యంల అయితే మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ప‌క్క‌నే కృష్ణాన‌ది ప్ర‌వ‌హిస్తుండడంతో నీటి ఊట‌లు పెరిగి.. ప‌ది అడుగుల‌కే నీరు చిమ్ముతోంది. దీంతో గ‌తంలో ప‌నులు ఆగిపోయాయి.

అయితే.. ఇప్పుడు 2028 నాటికి అమ‌రావ‌తి తొలి ద‌శ‌ను పూర్తిచేయాల‌ని సంక‌ల్పం పెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఎట్టిప‌రిస్థితిలోనూ.. ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తిచేయాల‌ని భావిస్తున్నారు. దీంతో జ‌ర్మ‌న్ టెక్నాల‌జీని వినియోగించి.. నీటిని తోడేయడంతోపాటు.. ఆవిరి యంత్రాల ద్వారా.. చెమ్మ ఉన్న‌ప్ప‌టికీ.. పిల్ల‌ర్లు వేసేలా ప్ర‌య‌త్నాలు ప్రారంభించాల‌ని ఆదేశాలిచ్చారు. దీంతో ప‌నులు ఆగ‌కుండా ముందుకు సాగాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం. ఇదేస‌మ‌యంలో నాణ్య‌త‌కు ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని కూడా సీఎం చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌తి ప‌నికీ లెక్క‌లు చూపాల‌న్న‌ది కూడా సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. అమ‌రావ‌తిలో ఏదో తినేస్తున్నార‌ని.. ప్ర‌తి ప‌నినీ ఎక్కువ ఖ‌ర్చుకు కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌హ‌జంగానే అమ‌రావ‌తిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు ఇక నుంచి ప్ర‌తి ప‌నికీ అయ్యే ఖ‌ర్చును ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏప‌నికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు? మెటీరియ‌ల్ వివ‌రాలు.. వాటి ఖ‌ర్చు.. వంటివాటిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తారు.

మొత్తంగా అమ‌రావ‌తి ప‌నుల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తిచేయ‌డ‌మే కాకుండా.. వాటిని పార‌ద‌ర్శ‌కంగా కూడా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఎక్క‌డా రాజీ లేని ధోర‌ణితో ముందుకు సాగాల‌ని.. 2028 చివ‌రి నాటికి న‌వ న‌గ‌రాల‌ను పూర్తిచేయాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. దీంతో అమ‌రావ‌తిపై జ‌రుగుతున్న విష ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ప‌నికీ లెక్క‌తోపాటు.. కాలాల‌తో సంబంధం లేకుండా ప‌నులు వేగంగా పూర్తి చేయ‌నున్నారు.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

2 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

2 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

4 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

5 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

7 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

7 hours ago