Political News

కాళేశ్వ‌రం వ‌ర్సెస్ పోల‌వరం: కేటీఆర్ కొత్త ర‌గ‌డ‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌ల ప్రాజెక్టుల‌కు సంబంధించి మ‌రో కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఏపీ అంటే ఒక‌లాగా, తెలంగాణ అంటే మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అంటూ కేంద్రంలోని బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో యాగీ చేస్తున్న వారు.. పొరుగున ఉన్న పోల‌వ‌రం విష‌యంలో క‌ళ్లు మూసుకున్నార‌ని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కాఫ‌ర్ డ్యామ్ ఇప్ప‌టికి రెండు సార్లు డ్యామేజీ అయింద‌ని.. అయినా కేంద్రం నుంచి ఎవ‌రూ రార‌ని, క‌నీసం ఆ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించ‌బోర‌ని వ్యాఖ్యానించారు.

కానీ, త‌మ హ‌యాంలో అనేక ప్ర‌యాస‌లు ప‌డి.. అనేక రాష్ట్రాల‌ను ఒప్పించి.. క‌ష్ట‌ప‌డి క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో మాత్రం నానా యాగీ చేస్తున్నార‌ని కేటీఆర్ దుయ్య‌బ్ట‌టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో మేడిగడ్డ పిల్ల‌ర్లు కుంగాయ‌ని, కానీ, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ అనుమానాల‌పై ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా దృష్టి పెట్ట‌కుండా.. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయ‌డానికి, విచార‌ణలు చేయ‌డానికి మాత్రం ముందుకు వ‌చ్చార‌ని కేటీఆర్ అన్నారు.

ప‌నిలో ప‌నిగా బీఆర్ ఎస్ పైనా, కేసీఆర్ పాల‌న‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో ఏపీలోని పోల‌వ‌రం ప్రాజెక్టు కాఫ‌ర్ డ్యామ్ రెండు సార్లు కొట్టుకుపోయింద‌న్నారు. తాజాగా కూడా.. కాఫ‌ర్ డ్యామ్‌కు డ్యామేజీ అయింద‌ని.. అయినా.. కూడా బీజేపీ నేత‌లు.. కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు సేఫ్టీ అథారిటీని రంగంలోకి దించ‌డం లేద‌న్నారు. కానీ, మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’ అని విమర్శిస్తున్నారని మండిప‌డ్డారు. అంతేకాదు.. దీనిపై పెద్ద క‌మీష‌న్ కూడా వేసి యాగీ చేస్తున్నార‌ని అన్నారు. ద‌మ్ముంటే.. కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు.. పోల‌వ‌రంపై కూడా.. విచార‌ణ‌కు ఆదేశించాల‌ని.. దానినికూడా ‘కూల‌వ‌రం’ అని పేర్కొనాల‌ని స‌వాల్ రువ్వారు. కానీ, వారు ఆ ప‌నిచేయ‌బోర‌ని దీనికి కార‌ణం అంద‌రికీ తెలిసిందేన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on August 16, 2025 10:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

28 minutes ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

56 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

2 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

2 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

2 hours ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago