పార్టీ కోసం వీరవిధేయుడిగా కష్టపడ్డారు. చంద్రబాబును తన తండ్రిగా పేర్కొన్నారు. వైసీపీపైనా.. ఆ పార్టీ నాయకులపైనా నిప్పులు చెరిగారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు తన తడాఖా చూపించారు. బలమైన గళం కూడా వినిపించారు. కానీ, చిన్న లోపం.. ఒకే ఒక్క చిన్న పొరపాటు.. సదరు తమ్ముడిని దేనికీ కొరగాకుండా చేసేసింది. ఆయనే విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న. ఇప్పటికే ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ ఆఫీసుకు కూడా ఆయన రావడం లేదు.
ఒకప్పుడు విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో.. బలమైన వాయిస్ వినిపించే నేతగా బుద్దా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ తరఫున పోరాడేవారిలోనూ ఆయన ముందు వరుసలో ఉన్నారు. గతంలో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. కానీ, ఇప్పుడు చూసుకుంటే..పార్టీ అధికారంలోకి వచ్చి.. 15 మాసాలైనా.. బుద్దా పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన గురించి మాట్లాడు కునే నాయకులు కానీ.. తలుచుకునే నేతలు కానీ కరువయ్యారు. దీనికి ప్రధానంగా ఒకే ఒక్క కారణం.. గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హంగామానేనని అంటున్నారు.
విజయవాడ వెస్టు కోసం పట్టుబట్టడం. ఈ క్రమంలో టికెట్ రాదని తెలిసినా.. రక్తతర్పణం పేరుతో చంద్రబాబు రక్తాభిషేకం చేయడం. పైగా.. పార్టీ నిర్ణయం తీసుకున్నాక… కూటమిలోని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని విభేదించడం. ఈ కారణంతో పార్టీ అధినేత బుద్దాను పక్కన పెట్టారు. తాజాగా ఇచ్చిన 31 నామినేటెడ్ పదవుల్లో ఇదే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాతోపాటు.. మరొకరికి కూడా పదవి దక్కింది. కానీ, కీలకమైన బుద్దాను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో బుద్దాకు పదవి దక్కే అవకాశం ఏమీ కనిపించడం లేదని కూడా అంటున్నా రు. వాస్తవానికి ఎమ్మెల్సీ కోరుకున్న బుద్దా.. ఈ పదవిపై కొన్నాళ్లు పోరాడారు. కానీ, అది దక్కలేదు. ఇక, ఆ తర్వాత.. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును కోరుకున్నారు. ఇది కూడా దక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పార్టీలో అయినా.. పదవి దక్కుతుందని ఆశించారు. ఇది సాధ్యం కాలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడు ప్రకటించిన వాటిలో అయినా.. తన పేరు ఉంటుందని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో బుద్దా పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. మరి ఆయన పార్టీలోనే ఉంటారో.. లేక వైసీపీ ఆహ్వానిస్తున్నట్టు వస్తున్న సమాచారం మేరకు.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారో చూడాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…