పార్టీ కోసం వీరవిధేయుడిగా కష్టపడ్డారు. చంద్రబాబును తన తండ్రిగా పేర్కొన్నారు. వైసీపీపైనా.. ఆ పార్టీ నాయకులపైనా నిప్పులు చెరిగారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు తన తడాఖా చూపించారు. బలమైన గళం కూడా వినిపించారు. కానీ, చిన్న లోపం.. ఒకే ఒక్క చిన్న పొరపాటు.. సదరు తమ్ముడిని దేనికీ కొరగాకుండా చేసేసింది. ఆయనే విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న. ఇప్పటికే ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ ఆఫీసుకు కూడా ఆయన రావడం లేదు.
ఒకప్పుడు విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో.. బలమైన వాయిస్ వినిపించే నేతగా బుద్దా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ తరఫున పోరాడేవారిలోనూ ఆయన ముందు వరుసలో ఉన్నారు. గతంలో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. కానీ, ఇప్పుడు చూసుకుంటే..పార్టీ అధికారంలోకి వచ్చి.. 15 మాసాలైనా.. బుద్దా పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన గురించి మాట్లాడు కునే నాయకులు కానీ.. తలుచుకునే నేతలు కానీ కరువయ్యారు. దీనికి ప్రధానంగా ఒకే ఒక్క కారణం.. గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హంగామానేనని అంటున్నారు.
విజయవాడ వెస్టు కోసం పట్టుబట్టడం. ఈ క్రమంలో టికెట్ రాదని తెలిసినా.. రక్తతర్పణం పేరుతో చంద్రబాబు రక్తాభిషేకం చేయడం. పైగా.. పార్టీ నిర్ణయం తీసుకున్నాక… కూటమిలోని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని విభేదించడం. ఈ కారణంతో పార్టీ అధినేత బుద్దాను పక్కన పెట్టారు. తాజాగా ఇచ్చిన 31 నామినేటెడ్ పదవుల్లో ఇదే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాతోపాటు.. మరొకరికి కూడా పదవి దక్కింది. కానీ, కీలకమైన బుద్దాను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో బుద్దాకు పదవి దక్కే అవకాశం ఏమీ కనిపించడం లేదని కూడా అంటున్నా రు. వాస్తవానికి ఎమ్మెల్సీ కోరుకున్న బుద్దా.. ఈ పదవిపై కొన్నాళ్లు పోరాడారు. కానీ, అది దక్కలేదు. ఇక, ఆ తర్వాత.. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును కోరుకున్నారు. ఇది కూడా దక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పార్టీలో అయినా.. పదవి దక్కుతుందని ఆశించారు. ఇది సాధ్యం కాలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడు ప్రకటించిన వాటిలో అయినా.. తన పేరు ఉంటుందని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో బుద్దా పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. మరి ఆయన పార్టీలోనే ఉంటారో.. లేక వైసీపీ ఆహ్వానిస్తున్నట్టు వస్తున్న సమాచారం మేరకు.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 16, 2025 5:07 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…