పార్టీ కోసం వీరవిధేయుడిగా కష్టపడ్డారు. చంద్రబాబును తన తండ్రిగా పేర్కొన్నారు. వైసీపీపైనా.. ఆ పార్టీ నాయకులపైనా నిప్పులు చెరిగారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు తన తడాఖా చూపించారు. బలమైన గళం కూడా వినిపించారు. కానీ, చిన్న లోపం.. ఒకే ఒక్క చిన్న పొరపాటు.. సదరు తమ్ముడిని దేనికీ కొరగాకుండా చేసేసింది. ఆయనే విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న. ఇప్పటికే ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ ఆఫీసుకు కూడా ఆయన రావడం లేదు.
ఒకప్పుడు విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో.. బలమైన వాయిస్ వినిపించే నేతగా బుద్దా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ తరఫున పోరాడేవారిలోనూ ఆయన ముందు వరుసలో ఉన్నారు. గతంలో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. కానీ, ఇప్పుడు చూసుకుంటే..పార్టీ అధికారంలోకి వచ్చి.. 15 మాసాలైనా.. బుద్దా పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన గురించి మాట్లాడు కునే నాయకులు కానీ.. తలుచుకునే నేతలు కానీ కరువయ్యారు. దీనికి ప్రధానంగా ఒకే ఒక్క కారణం.. గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హంగామానేనని అంటున్నారు.
విజయవాడ వెస్టు కోసం పట్టుబట్టడం. ఈ క్రమంలో టికెట్ రాదని తెలిసినా.. రక్తతర్పణం పేరుతో చంద్రబాబు రక్తాభిషేకం చేయడం. పైగా.. పార్టీ నిర్ణయం తీసుకున్నాక… కూటమిలోని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని విభేదించడం. ఈ కారణంతో పార్టీ అధినేత బుద్దాను పక్కన పెట్టారు. తాజాగా ఇచ్చిన 31 నామినేటెడ్ పదవుల్లో ఇదే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాతోపాటు.. మరొకరికి కూడా పదవి దక్కింది. కానీ, కీలకమైన బుద్దాను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో బుద్దాకు పదవి దక్కే అవకాశం ఏమీ కనిపించడం లేదని కూడా అంటున్నా రు. వాస్తవానికి ఎమ్మెల్సీ కోరుకున్న బుద్దా.. ఈ పదవిపై కొన్నాళ్లు పోరాడారు. కానీ, అది దక్కలేదు. ఇక, ఆ తర్వాత.. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును కోరుకున్నారు. ఇది కూడా దక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పార్టీలో అయినా.. పదవి దక్కుతుందని ఆశించారు. ఇది సాధ్యం కాలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడు ప్రకటించిన వాటిలో అయినా.. తన పేరు ఉంటుందని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో బుద్దా పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. మరి ఆయన పార్టీలోనే ఉంటారో.. లేక వైసీపీ ఆహ్వానిస్తున్నట్టు వస్తున్న సమాచారం మేరకు.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 16, 2025 5:07 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…