Political News

నేను బిజీ రాలేను: ‘ఎట్ హోమ్‌’కు జ‌గ‌న్ డుమ్మా

కీల‌క‌మైన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ డుమ్మా కొడుతున్నారు. అది కూడా గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మానికి కూడా ఆయ‌న హాజరు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ‘ఎట్ హోమ్‌’ పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వ ప‌క్షంతోపాటు.. ప్ర‌తిప‌క్షానికి కూడా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి ఆహ్వానం అందుతుంది.

ఇది సాధార‌ణంగా ఉండే ప్రొటోకాల్‌. ఇక‌, ఉన్న‌తాధికారుల నుంచి క్లాస్ 2 అధికారుల వ‌ర‌కు కూడా ఈ కార్య‌క్ర‌మానికి అతిథులుగా హాజ‌ర‌వుతారు. సుమారు రెండు గంట‌ల పాటు నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత స‌హా.. అంద‌రూ పాల్గొన్నారు. ఇక‌, ఇత‌ర శాఖల ఉన్న‌తాధికారులతోపాటు.. డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు వీరంతా.. ఎట్ హోమ్‌కు వ‌చ్చారు.

అయితే.. ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు కూడా గ‌వ‌ర్న‌ర్ నుంచి ఆహ్వానం అదింది. దీనికి ఆయ‌న రావాల్సి ఉంది. ఇది గ‌వ‌ర్న‌ర్ గౌర‌వార్థం నిర్వ‌హించే కార్య‌క్ర‌మం. దీనిలో రాజ‌కీయాల‌కు తావులేదు. గ‌తంలో 23 స్థానాల‌కు ప‌రిమిత‌మైనా.. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఎలాంటి రాజ‌కీయ ద‌గ్ధ మ‌న‌సులో పెట్టుకోకుండా ఎట్ హోం స‌హా.. హైటీ వంటి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రై.. గ‌వ‌ర్న‌ర్‌ను గౌర‌వించారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం అధికారంలో ఉన్న‌ప్పుడు స‌తీ స‌మేతంగా హాజ‌రై.. ఇప్పుడు మాత్రం డుమ్మా కొట్టారు.

“నేను బిజీగా ఉన్నాను.. రాలేను.” అని గ‌వ‌ర్న‌ర్‌కు పంపించిన సందేశంలో జ‌గ‌న్ పేర్కొన్నారు. అంటే.. ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్ని బాయి కాట్ చేశార‌న్న మాట‌. వాస్త‌వానికి గ‌త ఏడాది కూడా ఎట్ హోం కు ఇలానే డుమ్మా కొట్టారు. అయితే.. అప్ప‌ట్లో ఓట‌మితో ఆవేద‌న‌లో ఉన్నార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ… ఇప్పుడు 15 మాసాల త‌ర్వాత కూడా.. ఆయ‌న రాక‌పోవ‌డం.. తాను బిజీగా ఉన్నాన‌ని సందేశం పంపించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ప‌ట్ల‌, రాజ్యాంగం ప‌ట్ల జ‌గ‌న్‌కు ఉన్న గౌర‌వం ఇదేన‌ని.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.

This post was last modified on August 15, 2025 10:50 pm

Share

Recent Posts

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

27 minutes ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

1 hour ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

1 hour ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

6 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

7 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

11 hours ago