కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొడుతున్నారు. అది కూడా గవర్నర్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ‘ఎట్ హోమ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పక్షంతోపాటు.. ప్రతిపక్షానికి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందుతుంది.
ఇది సాధారణంగా ఉండే ప్రొటోకాల్. ఇక, ఉన్నతాధికారుల నుంచి క్లాస్ 2 అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత సహా.. అందరూ పాల్గొన్నారు. ఇక, ఇతర శాఖల ఉన్నతాధికారులతోపాటు.. డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ ఆహ్వానం మేరకు వీరంతా.. ఎట్ హోమ్కు వచ్చారు.
అయితే.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్కు కూడా గవర్నర్ నుంచి ఆహ్వానం అదింది. దీనికి ఆయన రావాల్సి ఉంది. ఇది గవర్నర్ గౌరవార్థం నిర్వహించే కార్యక్రమం. దీనిలో రాజకీయాలకు తావులేదు. గతంలో 23 స్థానాలకు పరిమితమైనా.. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఎలాంటి రాజకీయ దగ్ధ మనసులో పెట్టుకోకుండా ఎట్ హోం సహా.. హైటీ వంటి కార్యక్రమాలకు హాజరై.. గవర్నర్ను గౌరవించారు. అయినా.. జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా హాజరై.. ఇప్పుడు మాత్రం డుమ్మా కొట్టారు.
“నేను బిజీగా ఉన్నాను.. రాలేను.” అని గవర్నర్కు పంపించిన సందేశంలో జగన్ పేర్కొన్నారు. అంటే.. ఆయన ఈ కార్యక్రమాన్ని బాయి కాట్ చేశారన్న మాట. వాస్తవానికి గత ఏడాది కూడా ఎట్ హోం కు ఇలానే డుమ్మా కొట్టారు. అయితే.. అప్పట్లో ఓటమితో ఆవేదనలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ… ఇప్పుడు 15 మాసాల తర్వాత కూడా.. ఆయన రాకపోవడం.. తాను బిజీగా ఉన్నానని సందేశం పంపించడం విమర్శలకు దారితీసింది. గవర్నర్ వ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల జగన్కు ఉన్న గౌరవం ఇదేనని.. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చేలా చేసింది.
This post was last modified on August 15, 2025 10:50 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…