వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేష్ ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ని ప్రారంభించి అనంతరం.. విజయవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. “కొందరు ఉంటారు. వారిని రాక్షసులు అనాలో.. ఇంకేమైనా అనాలో.. కూడా అర్ధం కాదు. ఎందుకంటే.. వాళ్లు రాక్షసులకంటే కూడా ఘోరంగా తయారయ్యారు. విషం లాంటి మద్యం అమ్మి.. మహిళల తాళిబొట్లు తెంపాడు” అని జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
చెల్లితో రాఖీ కట్టించుకోలేని వాడు.. ఇప్పుడు మహిళల గురించి నీతులు చెబుతున్నాడు.. అని నారా లోకే ష్ మండిపడ్డారు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభించలేమని.. ఇదో ఉత్తుత్తి డ్రామా అని వ్యాఖ్యలు చేసిన వారు.. ఇప్పుడు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని లోకేష్ చెప్పారు. మహిళలను ఆది నుంచి గౌరవించిన పార్టీ టీడీపీ అయితే.. ఆది నుంచి మహిళలను అవమానించిన పార్టీ వైసీపీ అని విమర్శించారు.
“శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. మహిళలను అసభ్యంగా బూతులు తిడుతూ.. అదే గొప్ప అన్నట్టుగా పోస్టులు పెట్టారు. ఇంకా.. కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. మహిళల ను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మహిళలను అసభ్యంగా చూపించే.. సినిమాలు, సిరీస్లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలి.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తన తల్లి భువనేశ్వరి గురించి మాట్లాడుతూ.. ‘5వేల కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారు. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మహిళలకు చేయూత అందిస్తే.. ఎంత ఎత్తుకైనా ఎదుగుతారనేందుకు మా ఇల్లే ఉదాహరణ.’ అని చెప్పారు. మహిళలను కించపరిస్తే తోలుతీస్తానని చెప్పండి.. అని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ చంద్రన్న అండగా ఉన్నారని.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంతోపాటు.. అనేక సంఘాలను కూడా తీసుకువచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు.
This post was last modified on August 15, 2025 10:42 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…