Political News

కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఏమందంతే…

టీవీ ఛానెళ్లు నిర్వ‌హించే చ‌ర్చ‌లు.. ఈ సంద‌ర్భంగా పార్టిసిపెంట్లు చేసే వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు తాజాగా కీల‌క ఉత్త‌ర్వులు జారీచేసింది. “ఏదైనా చ‌ర్చ‌లో పాల్గొనే పార్టిసిపెంట్లు.. వివాదాస్ప‌ద‌, ప‌రువు న‌ష్టం క‌లిగించే వ్యాఖ్య‌లు, అంశాలు లేవ‌నెత్తిన‌ప్పుడు.. యాంక‌ర్లు.. వినోదం చూడ‌డం స‌రికాదు. వాటిని అరిక‌ట్టండి. స‌ద‌రు పార్టిసిపెంట్ల‌ను క‌ట్ట‌డి చేయండి. అవ‌స‌ర‌మైతే.. మీ చేతిలోనే రిమోట్ పెట్టుకుని వారి వాయిస్‌ను నిలువ‌రించిండి. అంతేకానీ.. మీకు సంబంధం లేద‌ని చూస్తూ కూర్చోవ‌ద్దు.” అని సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

విష‌యం ఇదీ..

రెండు మాసాల కింద‌ట సాక్షి ఛానెల్‌లో అమ‌రావ‌తిపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కృష్ణం రాజు అనే వ్యాఖ్యాత‌.. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో డిబేట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావు.. స్పందించారు. ఔన‌ను.. నేను కూడా చ‌దివాను.. అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసి గుంటూరు జైల్లో పెట్టారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి మ‌ధ్యంత‌ర బెయిల్‌ను తెచ్చుకున్నారు కొమ్మినేని.

తాజాగా ఈ మ‌ధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌(అంటే.. కేసు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు బెయిల్ పొంద‌డం)గా మార్పు చేయాల‌ని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై తాజాగా విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కొన్ని ఆంక్ష‌లు విధిస్తూ.. రెగ్యుల‌ర్ బెయిల్‌గా మార్చింది. న్యాయ‌మూర్తులు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు అభిప్రాయం కోరింది. కొమ్మినేనికి రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వ‌డంపై త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌భుత్వం చెప్పింది.

దీంతో యాంకర్‌గా నిర్వహించే చర్చల్లో పార్టిసిపెంట్లు ఎలాంటి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయ‌కుండా చూడాల‌ని, ఒక‌వేళ ఏదైనా వ్యాఖ్య చేస్తే వారిని అడ్డుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. అవ‌స‌ర‌మైతే.. పార్టిసిపెంట్ల వ్యాఖ్యలను మ్యూట్ చేసేలా చేతిలో రిమోట్‌ పెట్టుకోవాల‌ని ధ‌ర్మాస‌నం చూసించింది. అనంత‌రం కొమ్మినేనిని రెగ్యుల‌ర్ బెయిల్ ఇస్తూ.. తీర్పు చెప్పింది.

This post was last modified on August 15, 2025 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago