Political News

పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌బోని ప్ర‌ధాని తెగేసి చెప్పారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. సింధు న‌ది జ‌లాల‌ను.. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించి.. రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి స‌మీక్షించే ప్ర‌సక్తి కూడా లేద‌న్నారు.

2) ఆప‌రేష‌న్ సిందూర్: ఈ విష‌యంలో భార‌త్ రాజీప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్ రాజీ ప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామ‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగ‌బ‌డ్డ ఉగ్రవాదులకు ఆప‌రేష‌న్ సిందూర్‌తో గట్టి గుణపాఠం చెప్పామ‌ని.. సిందూర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపుల‌పై స్పందించిన ప్ర‌ధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడబోద‌న్నారు. భ‌య‌ప‌డ‌డానికి 140 కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ప్ర‌ధాని.. భార‌త్ జోలికి వ‌స్తే.. ఏకాకుల‌వుతార‌ని పాకిస్థాన్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago