Political News

పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌బోని ప్ర‌ధాని తెగేసి చెప్పారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. సింధు న‌ది జ‌లాల‌ను.. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించి.. రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి స‌మీక్షించే ప్ర‌సక్తి కూడా లేద‌న్నారు.

2) ఆప‌రేష‌న్ సిందూర్: ఈ విష‌యంలో భార‌త్ రాజీప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్ రాజీ ప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామ‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగ‌బ‌డ్డ ఉగ్రవాదులకు ఆప‌రేష‌న్ సిందూర్‌తో గట్టి గుణపాఠం చెప్పామ‌ని.. సిందూర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపుల‌పై స్పందించిన ప్ర‌ధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడబోద‌న్నారు. భ‌య‌ప‌డ‌డానికి 140 కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ప్ర‌ధాని.. భార‌త్ జోలికి వ‌స్తే.. ఏకాకుల‌వుతార‌ని పాకిస్థాన్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

This post was last modified on August 15, 2025 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago