Political News

పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌బోని ప్ర‌ధాని తెగేసి చెప్పారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. సింధు న‌ది జ‌లాల‌ను.. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించి.. రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి స‌మీక్షించే ప్ర‌సక్తి కూడా లేద‌న్నారు.

2) ఆప‌రేష‌న్ సిందూర్: ఈ విష‌యంలో భార‌త్ రాజీప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్ రాజీ ప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామ‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగ‌బ‌డ్డ ఉగ్రవాదులకు ఆప‌రేష‌న్ సిందూర్‌తో గట్టి గుణపాఠం చెప్పామ‌ని.. సిందూర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపుల‌పై స్పందించిన ప్ర‌ధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడబోద‌న్నారు. భ‌య‌ప‌డ‌డానికి 140 కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ప్ర‌ధాని.. భార‌త్ జోలికి వ‌స్తే.. ఏకాకుల‌వుతార‌ని పాకిస్థాన్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

Satya

Recent Posts

స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీలోని ఆశావ‌హుల‌కు అంద‌రికీ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన ముఖ్య…

8 minutes ago

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ…

13 minutes ago

భారతీయ థియేటర్లలో ‘ఒడిస్సీ’ జపం

ఇవాళ ఎక్కడ చూసినా ది ఒడిస్సి తాలూకు ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ సినిమా ట్వీట్లతో…

46 minutes ago

జూలై 17… ఇంటి వినోదానికి ఢోకా లేదు

కొత్త శుక్రవారం వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర బోలెడు సినిమాలు కనిపిస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోదామనిపించేలా ఏదీ లేకపోవడం బయ్యర్ వర్గాలను…

2 hours ago

సినిమా పిచ్చిలో ఇది వేరే లెవెల్

సినిమా పిచ్చిలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్…

4 hours ago

విజయ్ సర్కార్‌ను కూల్చే కుట్ర… ఏంటి ఈ ప్రాజెక్ట్ మేఘాలయ?

తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా…

6 hours ago