దాయాది దేశం పాకిస్థాన్కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. మూడు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయాల్లో పాక్ పేరు ఎత్తకుండానే ఆయన వార్నింగ్ ఇచ్చారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి శుక్రవారం ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విషయంలో ఎవరితోనూ ఎలాంటి చర్చలు ఉండబోని ప్రధాని తెగేసి చెప్పారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెలిపారు. అంతేకాదు.. సింధు నది జలాలను.. భారత్లోని ఇతర ప్రాంతాలకు మళ్లించి.. రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలోనూ ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి సమీక్షించే ప్రసక్తి కూడా లేదన్నారు.
2) ఆపరేషన్ సిందూర్: ఈ విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీ పడబోదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామని పరోక్షంగా పాకిస్థాన్ను హెచ్చరించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో గట్టి గుణపాఠం చెప్పామని.. సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపులపై స్పందించిన ప్రధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడబోదన్నారు. భయపడడానికి 140 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా లేరన్న ప్రధాని.. భారత్ జోలికి వస్తే.. ఏకాకులవుతారని పాకిస్థాన్ను పరోక్షంగా హెచ్చరించారు.
This post was last modified on August 15, 2025 12:08 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…