Political News

పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌బోని ప్ర‌ధాని తెగేసి చెప్పారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. సింధు న‌ది జ‌లాల‌ను.. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించి.. రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి స‌మీక్షించే ప్ర‌సక్తి కూడా లేద‌న్నారు.

2) ఆప‌రేష‌న్ సిందూర్: ఈ విష‌యంలో భార‌త్ రాజీప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్ రాజీ ప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామ‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగ‌బ‌డ్డ ఉగ్రవాదులకు ఆప‌రేష‌న్ సిందూర్‌తో గట్టి గుణపాఠం చెప్పామ‌ని.. సిందూర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపుల‌పై స్పందించిన ప్ర‌ధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడబోద‌న్నారు. భ‌య‌ప‌డ‌డానికి 140 కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ప్ర‌ధాని.. భార‌త్ జోలికి వ‌స్తే.. ఏకాకుల‌వుతార‌ని పాకిస్థాన్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

This post was last modified on August 15, 2025 12:08 pm

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ… ‘సమ్’తృప్తేనా?

డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…

3 hours ago

భయపెడుతున్న అమెరికా బాక్సాఫీస్

ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా తయారైంది. మన…

5 hours ago

క్రైమ్ సినిమాలు ఇంకెన్ని తీస్తారయ్యా

మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…

6 hours ago

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

7 hours ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

7 hours ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

7 hours ago