Political News

పులివెందుల‌లో అసెంబ్లీ రౌడీ ‘సీన్‌’.. దీనికి స‌మాధాన‌మేంటి జ‌గ‌న్!

బ్యాలెట్ల‌లో సాధార‌ణంగా ఓట‌ర్లు.. త‌మ ఓటు హ‌క్కును మాత్ర‌మే వినియోగించుకుంటారు. కానీ.. తొలిసారి ఏపీలో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కుతో పాటు.. మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబించేలా కొన్ని వ్యాఖ్య‌లు రాసి.. వేరేగా కూడా స్లిప్పులు వేశారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల‌, ఒంటిమిట్టల్లో ఈ నెల 12న జెడ్పీటీసీ అభ్య‌ర్థుల స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌రిగింది. దీనిని ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించారు.

కేవ‌లం అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఈవీఎంల‌ను వినియోగిస్తున్నారు. స్థానిక సంస్థ‌ల‌కు మాత్రం బ్యాలెట్ విధానంలో ఓట‌రు త‌న‌కు న‌చ్చిన అభ్య‌ర్థిని ఎంచుకునే అవ‌కాశం, ఎన్నుకునే అవ‌కాశం రెండూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌లో ఓట‌ర్లు బ్యాలెట్ విధానంలోనే త‌మ హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే..రెండు బ్యాలెట్ బాక్సుల్లో ఓట‌ర్లు.. త‌మ ఓటుతో పాటు ప్ర‌త్యేకంగా స్లిప్పులు కూడా వేశారు.

గ‌తంలో మోహ‌న్‌బాబు, దివ్య భార‌తిలు న‌టించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో కూడా ఇలానే ఓట‌ర్లు.. త‌మ ఓటుతో పాటు ప్ర‌త్యేకంగా స్లిప్పుల‌ను కూడా బాక్సుల్లో వేస్తారు. జైల్లో ఉన్న మోహ‌న్‌బాబుపై అక్ర‌మంగా కేసులు పెట్టార‌న్న‌ది తాము న‌మ్ముతున్నామ‌ని ప్ర‌జ‌లు పేర్కొంటూ.. ఆయా స్లిప్పులపై రాశారు. అలానే ఇప్పుడు కూడా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. పులివెందుల‌లోని ఓ బాక్సులో ఓ ఓట‌రు.. వేసిన ప్ర‌త్యేక స్లిప్పులో..’30 ఏళ్ల త‌ర్వాత‌.. ఓటు వేస్తున్నా. అంద‌రికీ దండాలు’ అని రాసి ఉంది. ఇక‌, ఒంటిమిట్ట‌లోనూ ఇలానే రాసి ఉంది. ఈ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక‌, ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింద‌ని, న‌కిలీ ఓట‌ర్లు వ‌చ్చార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. ఇదే నిజ‌మై ఉంటే.. ఎవ‌రైనా ఇలా రాస్తారా? త‌మ అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతారా? అనేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చేసిన కూట‌మికి కూడా ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 14, 2025 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

22 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago