Political News

పులివెందుల‌లో అసెంబ్లీ రౌడీ ‘సీన్‌’.. దీనికి స‌మాధాన‌మేంటి జ‌గ‌న్!

బ్యాలెట్ల‌లో సాధార‌ణంగా ఓట‌ర్లు.. త‌మ ఓటు హ‌క్కును మాత్ర‌మే వినియోగించుకుంటారు. కానీ.. తొలిసారి ఏపీలో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కుతో పాటు.. మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబించేలా కొన్ని వ్యాఖ్య‌లు రాసి.. వేరేగా కూడా స్లిప్పులు వేశారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల‌, ఒంటిమిట్టల్లో ఈ నెల 12న జెడ్పీటీసీ అభ్య‌ర్థుల స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌రిగింది. దీనిని ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించారు.

కేవ‌లం అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఈవీఎంల‌ను వినియోగిస్తున్నారు. స్థానిక సంస్థ‌ల‌కు మాత్రం బ్యాలెట్ విధానంలో ఓట‌రు త‌న‌కు న‌చ్చిన అభ్య‌ర్థిని ఎంచుకునే అవ‌కాశం, ఎన్నుకునే అవ‌కాశం రెండూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌లో ఓట‌ర్లు బ్యాలెట్ విధానంలోనే త‌మ హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే..రెండు బ్యాలెట్ బాక్సుల్లో ఓట‌ర్లు.. త‌మ ఓటుతో పాటు ప్ర‌త్యేకంగా స్లిప్పులు కూడా వేశారు.

గ‌తంలో మోహ‌న్‌బాబు, దివ్య భార‌తిలు న‌టించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో కూడా ఇలానే ఓట‌ర్లు.. త‌మ ఓటుతో పాటు ప్ర‌త్యేకంగా స్లిప్పుల‌ను కూడా బాక్సుల్లో వేస్తారు. జైల్లో ఉన్న మోహ‌న్‌బాబుపై అక్ర‌మంగా కేసులు పెట్టార‌న్న‌ది తాము న‌మ్ముతున్నామ‌ని ప్ర‌జ‌లు పేర్కొంటూ.. ఆయా స్లిప్పులపై రాశారు. అలానే ఇప్పుడు కూడా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. పులివెందుల‌లోని ఓ బాక్సులో ఓ ఓట‌రు.. వేసిన ప్ర‌త్యేక స్లిప్పులో..’30 ఏళ్ల త‌ర్వాత‌.. ఓటు వేస్తున్నా. అంద‌రికీ దండాలు’ అని రాసి ఉంది. ఇక‌, ఒంటిమిట్ట‌లోనూ ఇలానే రాసి ఉంది. ఈ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక‌, ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింద‌ని, న‌కిలీ ఓట‌ర్లు వ‌చ్చార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. ఇదే నిజ‌మై ఉంటే.. ఎవ‌రైనా ఇలా రాస్తారా? త‌మ అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతారా? అనేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చేసిన కూట‌మికి కూడా ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 14, 2025 3:49 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

11 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

19 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

31 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

35 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago