Political News

సుప్రీం ఎఫెక్ట్‌: ప‌ద‌వులు కోల్పోయిన కోదండ‌రామ్‌, అమీర్

తెలంగాణ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, అమీర్ అలీలు త‌మ స‌భ్య‌త్వాల‌ను కోల్పోయారు. వీరిద్ద‌రి శాస‌న మండ‌లి స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధ‌వారం సాయంత్రం సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే ఇవి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని.. వారికి క‌ల్పించిన అన్నిసౌక‌ర్యాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, అదేవిధంగా అధికారిక నివాసాల‌ను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు.. ఈ ఇద్ద‌రి స‌భ్య‌త్వాలు ర‌ద్దు చేస్తున్న కార‌ణంగా.. వీటిని భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ త‌క్షణం ఇవ్వరాద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక‌వేళ నోటిఫికేష‌న్ ఇచ్చినా.. తాము ఇవ్వ‌బోయే తుది తీర్పున కు లోబ‌డి న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫ‌లిత‌ంగా ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, అమీర్ అలీలు .. త‌మ శాస‌న మండ‌లి స‌భ్య‌త్వాల‌ను కోల్పోయారు. కాగా.. ఈ వ్య‌వ‌హారంపై ప్రొఫెస‌ర్ కోదండ రామ్ మౌనంగా ఉన్నారు. అమీర్ అలీ మాత్రం.. తాను రివ్యూ పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు చెప్పారు.

అస‌లు వివాదం ఏంటి?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌వర్న‌ర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, ప్ర‌ముఖ ఉర్దూ ప‌త్రిక ఎడిట‌ర్ అమీర్ అలీల‌ను ప్ర‌తిపాదించింది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కూడా త‌మ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజ్‌ శ్రవణ్‌ ,సత్యానారాయణకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

అయితే.. నాటి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. కాంగ్రెస్ ఇచ్చిన రెండు అభ్య‌ర్థిత్వాల‌ను స‌మ‌ర్ధించారు. బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థిత్వాల‌ను ఎలాంటి కార‌ణం చెప్ప‌కుండానే తిర‌స్క‌రించారు. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఇంత‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం కోదండ‌రామ్‌, అమీర్‌ల‌ను మండ‌లికి పంపించింది. దీంతో బీఆర్ఎస్ నేత‌లు.. న్యాయ‌పోరాటం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on August 13, 2025 9:25 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

12 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

29 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago