తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వీరిద్దరి శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని.. వారికి కల్పించిన అన్నిసౌకర్యాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా అధికారిక నివాసాలను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఈ ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేస్తున్న కారణంగా.. వీటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా.. తాము ఇవ్వబోయే తుది తీర్పున కు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు .. తమ శాసన మండలి సభ్యత్వాలను కోల్పోయారు. కాగా.. ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ కోదండ రామ్ మౌనంగా ఉన్నారు. అమీర్ అలీ మాత్రం.. తాను రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు.
అసలు వివాదం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ తరఫున ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీలను ప్రతిపాదించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తమ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి దాసోజ్ శ్రవణ్ ,సత్యానారాయణకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
అయితే.. నాటి గవర్నర్ తమిళి సై.. కాంగ్రెస్ ఇచ్చిన రెండు అభ్యర్థిత్వాలను సమర్ధించారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థిత్వాలను ఎలాంటి కారణం చెప్పకుండానే తిరస్కరించారు. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్లను మండలికి పంపించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు.. న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 13, 2025 9:25 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…