తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వీరిద్దరి శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని.. వారికి కల్పించిన అన్నిసౌకర్యాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా అధికారిక నివాసాలను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఈ ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేస్తున్న కారణంగా.. వీటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా.. తాము ఇవ్వబోయే తుది తీర్పున కు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు .. తమ శాసన మండలి సభ్యత్వాలను కోల్పోయారు. కాగా.. ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ కోదండ రామ్ మౌనంగా ఉన్నారు. అమీర్ అలీ మాత్రం.. తాను రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు.
అసలు వివాదం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ తరఫున ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీలను ప్రతిపాదించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తమ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి దాసోజ్ శ్రవణ్ ,సత్యానారాయణకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
అయితే.. నాటి గవర్నర్ తమిళి సై.. కాంగ్రెస్ ఇచ్చిన రెండు అభ్యర్థిత్వాలను సమర్ధించారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థిత్వాలను ఎలాంటి కారణం చెప్పకుండానే తిరస్కరించారు. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్లను మండలికి పంపించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు.. న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 13, 2025 9:25 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…