తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వీరిద్దరి శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని.. వారికి కల్పించిన అన్నిసౌకర్యాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా అధికారిక నివాసాలను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఈ ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేస్తున్న కారణంగా.. వీటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా.. తాము ఇవ్వబోయే తుది తీర్పున కు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు .. తమ శాసన మండలి సభ్యత్వాలను కోల్పోయారు. కాగా.. ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ కోదండ రామ్ మౌనంగా ఉన్నారు. అమీర్ అలీ మాత్రం.. తాను రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు.
అసలు వివాదం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ తరఫున ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీలను ప్రతిపాదించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తమ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి దాసోజ్ శ్రవణ్ ,సత్యానారాయణకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
అయితే.. నాటి గవర్నర్ తమిళి సై.. కాంగ్రెస్ ఇచ్చిన రెండు అభ్యర్థిత్వాలను సమర్ధించారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థిత్వాలను ఎలాంటి కారణం చెప్పకుండానే తిరస్కరించారు. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్లను మండలికి పంపించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు.. న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 13, 2025 9:25 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…