ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ 750 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టనున్నారు. పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వం.. రాజధానిలో బాలయ్య చైర్మన్గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి 21 ఎకరాలను కేటాయించింది. దీనిలో సమగ్ర కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు బసవ తారకం సంస్థ ముందుకు వచ్చింది. మొత్తం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 21 ఎకరాలకు తోడు మరో 10 ఎకరాలను త్వరలో నే కేటాయించనున్నారు.
భూమిపూజ
రాజధాని అమరావతిలోని తుళ్లూరు సమీపంలో కేటాయించిన 21 ఎకరాల్లో ప్రస్తుతం 15 ఎకరాల్లో నిర్మించే తొలి కేన్సర్ క్యాంపస్కు నటుడు బాలయ్య తాజాగా భూమి పూజ చేశారు. ఈ ప్రాంతంలో రెండు దశల్లో అత్యంత అధునాతన రీతిలో కేన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. బుధవారం నిర్వహించిన భూమి పూజలో బాలయ్య సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రెండు దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. హైదరాబాద్లో ఉన్న కేన్సర్ ఆసుపత్రి తరహాలో ఇక్కడ కూడా నిర్మాణం ఉంటుందన్నారు.
కాగా.. మొత్తం ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో 1) కేన్సర్ కేర్ క్యాంపస్ 2) రోగుల సంరక్షణకు ఎక్స్లెన్సీ సెంటర్ నిర్మించనున్నారు. ఫస్ట్ ఫేజ్లో 500 పడకల సామర్థ్యంతో రెండో ఫేజ్లో 1000 పడకల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. వీటిలో అధునాతన పరికరాలు సమకూరుస్తారు.
ఎప్పటికి పూర్తి?
తొలి దశ కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం 2028 డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుంది. స్థానికులకు అంటే.. భూమిని త్యాగం చేసిన రైతు కుటుంబాలకు ఉచితంగా.. ఏపీ వారికి 25 శాతం చార్జీలతో సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. తొలి దశలో 500 పడకలను ఏర్పాటు చేయనున్నారు.
ఏయే పరీక్షలు చేస్తారు?
1) వ్యాధి నివారణ.
2) ముందస్తు గుర్తింపు
3) చికిత్స
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…