Political News

లాక్ డౌన్ … కరోనా కంటే పెద్ద వైరస్ – నిపుణులు

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది… మన వద్ద పాపులర్ సామెత. కరోనా, లాక్ డౌన్ లకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొదటి లాక్ డౌన్ మన దేశం చాలా తెలివిగా విధించింది. సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందికి కూలీ పోయింది. అయినా పర్లేదు. ఎందుకంటే… ఆ లాక్ డౌన్ వల్ల కరోనా ఎంత పెద్ద ప్రమాదమో ప్రజలకు స్వీయ అవగాహన పెంచుకోవడానికి కారణమైంది.

లాక్ డౌన్ సామాన్యులకు కూడా కరోనా తీవ్రతను తెలియజెప్పింది. ఇపుడు బతికున్న ఏ మనిసి కూడా దేశంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. దీంతో కరోనా గురించి అందరూ తెలుసుకున్నారు. కానీ ఈ లాక్ డౌన్ లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారు. ప్రభుత్వం ప్రజలకు సహకరించడం లేదు.

ఎందుకంటే 20 రోజుల్లో ప్రభుత్వం టెస్టులను పెంచకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. ఎన్నారై, మర్కజ్ ఈ రెండింటి వల్లే వ్యాపించిందని తెలిసినపుడు అది ఎక్కడ పెరిగే అవకాశం ఉందో కూడా స్పష్టంగా అర్థమైనపుడు దానిని అరికట్టడంలో మోడీ సర్కారు విఫలం కావడం వల్ల రెండో లాక్ డౌన్ వేయాల్సి వచ్చింది. కానీ దీనిని కూడా సరిగా వినియోగించుకోలేదు. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన టెస్టింగ్ కెపాసిటీ చాలా తక్కువే.

రెండో లాక్ డౌన్ అనంతరం లాక్ డౌన్ 3.0 గురించి చర్చ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు పెడదాం అంటున్నాయి. ఇంకొన్ని పెట్టేశాయి. అయితే… నిపుణులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాక్ డౌన్ మరింత పెంచితే కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టం కంటే… లాక్ డౌన్ అతిపెద్ద వైరస్ గా మారి మనల్ని తినేస్తుందంటున్నారు.

మనదేశంలో ఇన్ఫో నారాయణమూర్తి, రఘురాం రాజన్, ఇతర దేశాల్లో కూడా కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంకా పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. పేద దేశంలో కొంత కాలం లాక్ డౌన్ మంచిదే కానీ… సుధీర్ఘంగా పెంచుకుంటూ పోతే ఆకలిని ప్రభుత్వం కూడా తరిమి కొట్టడం లేదు.

పేదల సంఖ్య ప్రభుత్వ శక్తి కి మించి ఉన్న చోట అంత మందికి సాయం చేయడం ఇక్కడ కుదిరే పని కాదు అంటూ ఆయన హెచ్చరించారు. ఇన్ఫో నారాయణమూర్తి ఏమంటున్నారంటే… లాక్ డౌన్ పొడిగిస్తే దేశ వ్యాప్తంగా సుమారు 19 కోట్ల మంది అసంఘటిత.. స్వయం ఉపాధితో బతుకుతున్నారని.. లాక్ డౌన్ పొడిగిస్తే ఇలాంటి వారి జీవనాధారం ప్రమాదంలో పడుతుందన్నారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని కోల్పోతారన్నారు. ఇది ఎన్నో కుటుంబాలను చిదిమేస్తుందన్నారు.

మిలియనీర్లు మునిగిపోవడం అంటే వారు ఆకలితో చావరు. మహా అయితే వారి సంపద పెరగడం ఆగిపోతుంది. కానీ మిలియన్ సంపద పెరగడం ఎపుడు ఆగుతుంది? అతని కంపెనీలు మూతపడినపుడు… మరి అపుడు ఆ ఉద్యోగులు రోడ్డున పడక తప్పదు.

అంటే లాక్ డౌన్ వల్ల ఎటుచూసినా సామాన్యుడే నష్టపోతాడు. చాలా కంపెనీలో భవిష్యత్తు మీద ఆశతో నడుపుతుంటాయి. అవి ఈ లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ తెరచుకునే పరిస్థితి ఉండదు. ఈ దేశంలో 10 శాతం కంపెనీలు చిన్న ఒడిదుడుకులను కూడా తట్టుకోలేవు.

వాటి యజమానులు ఇంత సుధీర్ఘ కాలం నష్టంతో నడపలేరు అవన్నీ మూతపడక తప్పదు, మళ్లీ తెరచుకోవు కూడా అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. అందుకే కరోనా వైరస్ ను అంతమొందించే క్రమంలో లాక్ డౌన్ వైరస్ ను తెచ్చి ప్రాణాలు తీసుకోవద్దు.

ఆర్థిక వ్యవస్థను, కరోనాను రెండింటీన కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చాణక్యం ప్రభుత్వాలు ప్రదర్శిస్తే బాగుపడతాం. లేకపోతే అడ్డంగా మునిగిపోతాం అన్నది నిపుణుల అభిప్రాయం.

This post was last modified on May 1, 2020 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago