వివేకా హత్య సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక, జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను వివేకా తనయురాలు సునీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లుగా సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ, తాను ఆ లేఖపై సంతకం చేయలేదని గుర్తు చేసుకున్నారు.
ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనల గురించి ఎస్పి అశోక్ కుమార్ తో సునీత భేటీ అయ్యారు. ఈ ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలిపోటుతో తన తండ్రి వివేకా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారని, కానీ దానిని గుండెపోటు అని చెప్పారని సునీత గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు హత్య చేశారని నమ్మబలికారని, పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచివేశారని ఆరోపించారు.
వివేకా హత్య సమయం నాటి పరిస్థితులు ఇప్పుడు జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో కనిపిస్తున్నాయని అన్నారు. తమ బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నానని, ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాను తాను, తన భర్త చంపించినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
This post was last modified on August 7, 2025 5:55 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…