వివేకా హత్య సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక, జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను వివేకా తనయురాలు సునీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లుగా సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ, తాను ఆ లేఖపై సంతకం చేయలేదని గుర్తు చేసుకున్నారు.
ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనల గురించి ఎస్పి అశోక్ కుమార్ తో సునీత భేటీ అయ్యారు. ఈ ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలిపోటుతో తన తండ్రి వివేకా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారని, కానీ దానిని గుండెపోటు అని చెప్పారని సునీత గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు హత్య చేశారని నమ్మబలికారని, పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచివేశారని ఆరోపించారు.
వివేకా హత్య సమయం నాటి పరిస్థితులు ఇప్పుడు జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో కనిపిస్తున్నాయని అన్నారు. తమ బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నానని, ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాను తాను, తన భర్త చంపించినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
This post was last modified on August 7, 2025 5:55 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…