Political News

సింగ‌పూర్‌ను సైతం బెదిరించిన వైసీపీ: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమ‌రావతి రూప‌క‌ల్ప‌నలో కీల‌క పాత్ర పోషించిన సింగ‌పూర్‌ను సైతం వైసీపీ నాయ‌కులు బెదిరించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావతిని ప‌క్క‌న పెట్ట‌డం.. అరాచ‌కాలు సృష్టించ‌డంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం భ‌య ప‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాకుండా.. వైసీపీ మంత్రులు కొంద‌రు సింగ‌పూర్‌కు వెళ్లి.. అక్క‌డి వారిని బెదిరింపుల‌కు గురిచేశార‌ని అన్నారు. దీంతో సింగ‌పూర్‌కుచెందిన కంపెనీలు, పెట్టుబ‌డులు కూడా వెన క్కి వెళ్లిపోయాయ‌ని చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడి.. వారిని ఒప్పించి.. తిరిగి పెట్టు బ‌డులు పెట్టేలా చేసేందుకు నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. గ‌త నెల 26 నుంచి చంద్ర‌బాబు నాలుగు రోజుల పాటు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించారు. ఈక్ర‌మంలో ఆయ‌న సింగ‌పూర్ మంత్రులు స‌హా.. పెట్టుబ‌డి దారుల‌తో కూడా భేటీ అయ్యారు. అయితే.. చంద్ర‌బాబు సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.

తాజాగా కేబినెట్ సమావేశంలో సీఎం చంద్ర‌బాబు త‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న విశేషాల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. వైసీపీ హ‌యాంలో సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌ను, మంత్రుల‌ను కూడా భ‌య పెట్టార‌ని అన్నారు. దీంతో ఏపీపై సింగ‌పూర్‌కు న‌మ్మ‌కం పూర్తిగా పోయింద‌న్నారు. తిరిగి ఆ న‌మ్మ‌కాన్ని పున‌రుద్ధ రించేందుకు ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ ఏడాది నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు రావాల‌ని పిలిచినా.. సింగ‌పూర్ ప్ర‌తినిధులు, మంత్రులు తొలుత ఒప్పుకోలేద‌ని తెలిపారు. దీనికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీసిన‌ట్టు సీఎం చెప్పారు.

వైసీపీ హ‌యాంలో ప‌లువురు మంత్రులు సింగ‌పూర్‌కు వెళ్లి అక్క‌డి మంత్రుల‌ను బెదిరించిన విష‌యం వె లుగు చూసింద‌న్నారు. అందుకే వారు ఏపీకి వ‌చ్చేందుకు కూడా విముఖత వ్య‌క్తం చేశార‌ని అన్నారు. వారి ని బుజ్జ‌గించి.. ఏపీకి ర‌ప్పించే విష‌యంలో ఒప్పించేందుకు నానా ప్ర‌యాస ప‌డిన‌ట్టు వివ‌రించారు. త్వ‌ర లోనే సింగ‌పూర్ నుంచి భారీ పెట్టుబ‌డులు రానున్నాయ‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసి.. సింగ‌పూర్ పెట్టుబ‌డి దారులు వ‌స్తున్నార‌ని వివ‌రించారు.

This post was last modified on August 6, 2025 7:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

32 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

52 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago