Political News

సింగ‌పూర్‌ను సైతం బెదిరించిన వైసీపీ: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమ‌రావతి రూప‌క‌ల్ప‌నలో కీల‌క పాత్ర పోషించిన సింగ‌పూర్‌ను సైతం వైసీపీ నాయ‌కులు బెదిరించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావతిని ప‌క్క‌న పెట్ట‌డం.. అరాచ‌కాలు సృష్టించ‌డంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం భ‌య ప‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాకుండా.. వైసీపీ మంత్రులు కొంద‌రు సింగ‌పూర్‌కు వెళ్లి.. అక్క‌డి వారిని బెదిరింపుల‌కు గురిచేశార‌ని అన్నారు. దీంతో సింగ‌పూర్‌కుచెందిన కంపెనీలు, పెట్టుబ‌డులు కూడా వెన క్కి వెళ్లిపోయాయ‌ని చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడి.. వారిని ఒప్పించి.. తిరిగి పెట్టు బ‌డులు పెట్టేలా చేసేందుకు నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. గ‌త నెల 26 నుంచి చంద్ర‌బాబు నాలుగు రోజుల పాటు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించారు. ఈక్ర‌మంలో ఆయ‌న సింగ‌పూర్ మంత్రులు స‌హా.. పెట్టుబ‌డి దారుల‌తో కూడా భేటీ అయ్యారు. అయితే.. చంద్ర‌బాబు సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.

తాజాగా కేబినెట్ సమావేశంలో సీఎం చంద్ర‌బాబు త‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న విశేషాల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. వైసీపీ హ‌యాంలో సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌ను, మంత్రుల‌ను కూడా భ‌య పెట్టార‌ని అన్నారు. దీంతో ఏపీపై సింగ‌పూర్‌కు న‌మ్మ‌కం పూర్తిగా పోయింద‌న్నారు. తిరిగి ఆ న‌మ్మ‌కాన్ని పున‌రుద్ధ రించేందుకు ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ ఏడాది నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు రావాల‌ని పిలిచినా.. సింగ‌పూర్ ప్ర‌తినిధులు, మంత్రులు తొలుత ఒప్పుకోలేద‌ని తెలిపారు. దీనికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీసిన‌ట్టు సీఎం చెప్పారు.

వైసీపీ హ‌యాంలో ప‌లువురు మంత్రులు సింగ‌పూర్‌కు వెళ్లి అక్క‌డి మంత్రుల‌ను బెదిరించిన విష‌యం వె లుగు చూసింద‌న్నారు. అందుకే వారు ఏపీకి వ‌చ్చేందుకు కూడా విముఖత వ్య‌క్తం చేశార‌ని అన్నారు. వారి ని బుజ్జ‌గించి.. ఏపీకి ర‌ప్పించే విష‌యంలో ఒప్పించేందుకు నానా ప్ర‌యాస ప‌డిన‌ట్టు వివ‌రించారు. త్వ‌ర లోనే సింగ‌పూర్ నుంచి భారీ పెట్టుబ‌డులు రానున్నాయ‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసి.. సింగ‌పూర్ పెట్టుబ‌డి దారులు వ‌స్తున్నార‌ని వివ‌రించారు.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

15 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

41 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

42 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago