వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన సింగపూర్ను సైతం వైసీపీ నాయకులు బెదిరించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టడం.. అరాచకాలు సృష్టించడంతో సింగపూర్ ప్రభుత్వం భయ పడినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా.. వైసీపీ మంత్రులు కొందరు సింగపూర్కు వెళ్లి.. అక్కడి వారిని బెదిరింపులకు గురిచేశారని అన్నారు. దీంతో సింగపూర్కుచెందిన కంపెనీలు, పెట్టుబడులు కూడా వెన క్కి వెళ్లిపోయాయని చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సింగపూర్ ప్రతినిధులతో మాట్లాడి.. వారిని ఒప్పించి.. తిరిగి పెట్టు బడులు పెట్టేలా చేసేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత నెల 26 నుంచి చంద్రబాబు నాలుగు రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. ఈక్రమంలో ఆయన సింగపూర్ మంత్రులు సహా.. పెట్టుబడి దారులతో కూడా భేటీ అయ్యారు. అయితే.. చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత.. ఆయా వివరాలను వెల్లడించలేదు.
తాజాగా కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటన విశేషాలను మంత్రులకు వివరించారు. వైసీపీ హయాంలో సింగపూర్ ప్రతినిధులను, మంత్రులను కూడా భయ పెట్టారని అన్నారు. దీంతో ఏపీపై సింగపూర్కు నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. తిరిగి ఆ నమ్మకాన్ని పునరుద్ధ రించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రావాలని పిలిచినా.. సింగపూర్ ప్రతినిధులు, మంత్రులు తొలుత ఒప్పుకోలేదని తెలిపారు. దీనికి గల కారణాలను ఆరా తీసినట్టు సీఎం చెప్పారు.
వైసీపీ హయాంలో పలువురు మంత్రులు సింగపూర్కు వెళ్లి అక్కడి మంత్రులను బెదిరించిన విషయం వె లుగు చూసిందన్నారు. అందుకే వారు ఏపీకి వచ్చేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారని అన్నారు. వారి ని బుజ్జగించి.. ఏపీకి రప్పించే విషయంలో ఒప్పించేందుకు నానా ప్రయాస పడినట్టు వివరించారు. త్వర లోనే సింగపూర్ నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన చూసి.. సింగపూర్ పెట్టుబడి దారులు వస్తున్నారని వివరించారు.
This post was last modified on August 6, 2025 7:00 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…