ఏపీ రాజధాని.. అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. 33 వేల ఎకరాలకు తోడు మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వారు తాము పుట్టిన నేలకు రుణం తీర్చుకునే అవకాశాన్ని కూడా చంద్రబాబు కల్పిస్తున్నారు. సహజంగానే చాలా మంది పుట్టి పెరిగిన నేలకు ఏమైనా చేయాలని భావిస్తారు. వారి వారి సొంత ప్రాంతాల్లో ఏదో ఒక కార్యక్ర మం ద్వారా ఈ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలానే ఇప్పుడు.. అమరావతి కోసం కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని బావించే వారికి ఏపీ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు.. అమరావతి కోసం.. పరోక్షంగా స్వేదం చిందించేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. ప్రత్యక్షంగా ఈ మహాక్రతువులో పాలు పంచుకునే అవకాశం లేనివారికి.. పరోక్షంగా భాగస్వామ్యం కల్పిం చేందుకు సర్కారు సిద్ధమైంది. ఇంటికో పువ్వు ఈశ్వరుడికి ఓ మాల.. అన్న చందంగా.. అమరావతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావొచ్చు.
ఎలా?
అమరావతి నిర్మాణానికి ఎక్కడి నుంచైనా ఎవరైనా.. భాగస్వామ్యం కావాలని అనుకునే వారు.. రూ.10 నుం చి ఎంతైనా విరాళంగా ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనికిగాను.. ఆన్లైన్ పోర్టల్ను సీఆర్ డీఏ ప్రారంభించింది. ‘crda.ap.gov.in’లోకి వెళ్తే.. రాజధాని విరాళం పేరుతో(డొనేషన్ టు అమరావతి) ఒక లింకు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే.. క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిని స్కాన్చేసి మీరు చెల్లించాల్సిన మొత్తం జమ చేయవచ్చు. అనంతరం.. మీ పేరుతో ఆటోమేటిక్గా ఓ రశీదు వస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం ఉంటుంది. మరి ఇంకెందుకాలస్యం.. రాజధాని నిర్మాణానికి తలోచేయి వేద్దాం.!
This post was last modified on August 5, 2025 3:35 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…