Political News

అమ‌రావ‌తికి రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌… !

అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంది. 2014 -2019 మధ్య భారీ ఎత్తున అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగానే సాగాయి. పెద్ద ఎత్తున వెంచర్లు కూడా పడ్డాయి. అంతేకాదు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేయాలని భావించారు. అలాగే వెంచర్లలో ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశారు. దీంతో అప్పట్లో రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో ముందుకు సాగింది. ఇది పొరుగు రాష్ట్రాలకు కూడా పోటీగా మారింది. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతం పై తీవ్ర ప్రభావం పడింది.

వాస్తవానికి జగన్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని తనదైన శైలిలో ముందుకు నడిపిస్తారని, అద్భుతంగా కడతారని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా జగన్ 2020లో మూడు రాజధానులు ప్రతిపాదన చేయడంతో ఒక్కసారిగా అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆ తర్వాత వ్యాపార వర్గాలన్నీ హైదరాబాదును ఎంచుకోవడం అక్కడి ప్రభుత్వం కూడా వ్యాపారులను స్వాగ‌తించటం అందరికీ తెలిసిందే. అంతే కాదు ‘ఏపీలో జగన్ ఉంటే తమ వ్యాపారాలు బాగుంటాయని’ తెలంగాణ పాలకులు సైతం అప్పట్లో చెప్పుకొచ్చారు.

ఇలా రియల్ ఎస్టేట్ రంగం గత ఐదు సంవత్సరాలలో భారీగా దెబ్బతింది. తర్వాత గత ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాదులో ఇస్తున్న రాయితీలు, విస్తృతమైన అవకాశాలు, మెట్రో ప్రాజెక్టులు వంటివి వ్యాపారులను అక్కడే ఉండేలా హైదరాబాద్‌నే ఆకర్షించేలా చేశాయి. దీంతో అమరావతిలో అనుకున్న విధంగా తొలి ఏడాది అడుగులు పడలేదు. దీనిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు విస్తృతమైన ప్రాజెక్టులు సాధించే దిశగా అమరావతిని విస్తరించే దిశగా వేసిన అడుగులు ప్రస్తుతం ఫలించారు.

ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్లు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్, చెన్నై సహా గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతుండడం వంటివి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుళ్లూరు, వెంకటాయపాలెం, మంగళగిరి ప్రాంతాల పరిధిలో రోజు కనీసం 20 నుంచి 30 రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. సో మొత్తానికి తొలి ఏడాది కొంత చప్పగా సాగిన ప్రస్తుతం అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

This post was last modified on August 5, 2025 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

16 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

19 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago