కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై నియమితులైన జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. అంతేకాదు.. ఈ కమిషన్ నివేదికను సంక్షిప్తీకరించి.. మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపైనా చర్చించింది. పీసీ ఘోష్ కమిషన్ 620 పేజీలతోకూడిన నివేదికను నాలుగు రోజుల కిందట ప్రభుత్వానికి అందించిం ది. దీనిలో కీలకమైన అంశాలను క్రోడీకరించిన మంత్రివర్గ ఉపసంఘం 62 పేజీలకు కుదించింది. అయితే.. పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ పేరును 132 చోట్ల ప్రస్తావించింది.
అయితే.. దీనిని కుదించిన మంత్రి వర్గ ఉప సంఘం తాము ఇచ్చిన సంక్షిప్త నివేదికలోనూ.. 32 చోట్ల మాజీ సీఎం కేసీఆర్ పేరును పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా అప్పటి జల వనరుల శాఖ మంత్రి హరీష్రావు పేరును 19 చోట్ల, ఈటల రాజేందర్ పేరును 5 చోట్ల ప్రస్తావించారు. మొత్తంగా ఈ నివేదికపై మంత్రి వర్గం 4 గంటల పాటు చర్చించింది. నివేదికను యథాతథంగా అమలు చేయడమా? లేక.. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడమా? అనే విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సహా.. మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలను.. పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సీఎం సహా మంత్రులకు సమగ్రంగా వివరించారు. తప్పులు ఎక్కడ జరిగాయి? ఏయే అంశాలను అప్పటి ప్రభుత్వం విస్మరించింది? అప్పటి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అప్పటి సీఎంగా కేసీఆర్ నిర్ణయాలు.. ఇలా అన్ని అంశాలపైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రధానంగా.. కమిషన్ వెల్లడించిన.. కేసీఆర్ ఇష్టానుసారంగానే.. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారన్న వాదనపై మంత్రివర్గం దృష్టి పెట్టింది.
అయితే.. అధ్యయన కమిటీ(మంత్రివర్గ ఉపసంఘం) ఇచ్చిన సంక్షిప్త నివేదికను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం.. సిట్ వేసి.. మరింత లోతుగా చట్టంప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చించాలని భావించారు. అయితే.. ఇప్పటికిప్పుడు తుది నిర్ణయానికి రాకుండా.. నివేదికపై సిట్ అధికారులను నియమించి.. వారి ద్వారా విచారణను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏం చేసినా.. చట్టం, న్యాయ పరిధిలోనే ఉండాలని.. ప్రభుత్వం బద్నాం కాకుండా.. ముందుకు సాగాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది.
This post was last modified on August 5, 2025 10:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…